![]() |
AP Board Class 9 Telugu Grammar Chandassu ఛందస్సు Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 9th Telugu Grammar Chandassu ఛందస్సు Book Answers |
Andhra Pradesh Board Class 9th Telugu Grammar Chandassu ఛందస్సు Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 9th Telugu Grammar Chandassu ఛందస్సు Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 9th Telugu Grammar Chandassu ఛందస్సు Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 9th Telugu Grammar Chandassu ఛందస్సు solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 9th Telugu Grammar Chandassu ఛందస్సు Textbooks. These Andhra Pradesh State Board Class 9th Telugu Grammar Chandassu ఛందస్సు Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 9th Telugu Grammar Chandassu ఛందస్సు Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 9th |
Subject | Maths |
Chapters | Telugu Grammar Chandassu ఛందస్సు |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 9th Telugu Grammar Chandassu ఛందస్సు Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 9th Telugu Grammar Chandassu ఛందస్సు Answers.
- Look for your Andhra Pradesh Board STD 9th Telugu Grammar Chandassu ఛందస్సు Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 9th Telugu Grammar Chandassu ఛందస్సు Textbook Solutions for PDF Free.
AP Board Class 9th Telugu Grammar Chandassu ఛందస్సు Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 9th Telugu Grammar Chandassu ఛందస్సు Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:AP State Syllabus 9th Class Telugu Grammar
తెలుగు సంధులు
నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.
గమనిక :
పై వాక్యంలో “చిన్నప్పుడు” అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాలు కలవడం వల్ల వచ్చింది. దీనినే “సంధి పదం” అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినప్పుడు,
లేదా రాయవలసినప్పుడు, “సంధి పదం” ఏర్పడుతుంది.
తెలుగు సంధులు :
రెండు తెలుగుపదాల మధ్య జరిగే సంధులను “తెలుగు సంధులు” అంటారు.
సంధి :
వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికను “సంధి” అని పిలుస్తారు.
సంధి కార్యం :
రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును “సంధి కార్యం” అని పిలుస్తారు.
పూర్వ స్వరం :
సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును, (స్వరాన్ని) “పూర్వ స్వరం” అని పిలుస్తారు.
పర స్వరం :
సంధి జరిగే రెండవ పదము మొదటి అక్షరములోని అచ్చును (స్వరాన్ని) “పర స్వరం” అని పిలుస్తారు.
ఉదా :
రామ + అయ్య : ‘మ’ లో ‘అ’, పూర్వ స్వరం; ‘అయ్య’ లోని ‘అ’ పర స్వరం.
1. అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళము.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
మేనల్లుడు = మేన + అల్లుడు = (న్ +) అ + అ = అ = (అత్వ సంధి)
1) ఒకప్పుడు = ఒక + అప్పుడు = (అ + అ = అ) = (అత్వ సంధి)
2) వచ్చినందుకు = వచ్చిన + అందుకు = (అ + అ = అ) = (అత్వ సంధి)
3) రాకుంటే = రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = (అత్వ సంధి)
4) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) = (అత్వ సంధి)
5) పోవుటెట్లు = పోవుట + ఎట్లు = (అ + ఎ = ఎ) = (అత్వ సంధి)
గమనిక :
పై సంధి పదాలలోని పూర్వ స్వరం ‘అ’. అది పర స్వరంలోని అచ్చుతో కలిస్తే పూర్వ స్వరం ‘అ’ లోపిస్తుంది. ‘అ’ లోపించింది కాబట్టి ‘అత్వ సంధి’.
అత్వసంధి లేక ‘అకారసంధి’ అంటారు. పొట్టి ‘అ’ అనే అక్షరానికి అచ్చు పరమైతే ‘అత్వ సంధి’ వస్తుంది.
* అత్వ సంధి (అకార సంధి) సూత్రం :అత్తునకు సంధి బహుళము.
2. ఇత్వ సంధి
సూత్రం :ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) ఏమంటివి = ఏమి + అంటివి = (ఇ + అ = అ) = (ఇత్వ సంధి)
సంధి జరుగనప్పుడు “య కారం” ఆగమంగా వస్తుంది. దానినే ‘యడాగమం’ అని పిలుస్తారు.
ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = (ఇ + అ = య) : (ఇకారసంధి రాని యడాగమరూపం)
గమనిక :
ప్రథమ, ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారమునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది.
వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు – (ఇ + ఇ + ఇ) – (ఇత్వ సంధి)
వచ్చిరియిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు – (ఇ + ఇ + యి) (యడాగమం వచ్చిన రూపం)
గమనిక :
పై ఉదాహరణములలో హ్రస్వ ఇకారానికి అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ఇత్వ సంధి తప్పక జరుగాలన్న నియమం లేదు.
వైకల్పికం :
ఇత్వ సంధి జరుగవచ్చు లేక జరుగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అని పిలుస్తారు.
అభ్యాసము :
ఉదా :
1) ఏమంటివి = ఏమి + అంటివి = (మ్ + ఇ + అ = మ)
2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు – (ఇ + ఎ = ఎ) = ఇత్వ సంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు = (ఇ + అ = అ) = ఇత్వ సంధి
3. ఉత్వ సంధి
ఉకారసంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యం.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
రాముడతడు = రాముడు + అతడు = (డ్ + ఉ + అ = డ) = (ఉత్వ సంధి)
1) అతడెక్కడ = అతడు + ఎక్కడ = (ఉ + ఎ = ఎ) = (ఉత్వ సంధి)
2) మనమున్నాము = మనము + ఉన్నాము = (ఉ + ఉ = ఉ) = (ఉత్వ సంధి)
3) మనసైన = మనసు + ఐన = (ఉ + ఐ = ఐ) = (ఉత్వ సంధి)
గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా ఉత్తుకు, అచ్చు కలిసినప్పుడు, పూర్వ స్వరం ఉకారం లోపించి, పర స్వరం కనిపిస్తుంది. లోపించిన పూర్వ స్వరం ‘ఉ’ కాబట్టి, ఇది “ఉత్వ సంధి” అని పిలువబడుతుంది.
ఉత్వ సంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యం.
నిత్యం : నిత్యం అంటే, తప్పక సంధికార్యం జరుగుతుందని అర్థం
4. యడాగమం సంధి
సూత్రం : సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అని పిలుస్తారు.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
ఆ) మాయిల్లు = మా + ఇల్లు = మాయిల్లు
ఇ) హరియతడు = హరి + అతడు = హరియతడు
గమనిక :
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కాని కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
అ)మా + య్ + అమ్మ = మా ‘య’ మ్మ
ఆ)మా + య్ + ఇల్లు = మా ‘ఋ’ ల్లు
ఇ) హరి + య్ + అతడు = హరి ‘య’ తడు
యడాగమం :
సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అంటారు.
5. ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.
ఆమ్రేడితం :
మొదట పలికిన పదమునే తిరిగి పలుకుతాము. అలా రెండవమారు పలికిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటాము.
ఉదా :
1) ‘ఆహా + ఆహా ఆహా అనే పదం రెండుసార్లు వచ్చింది. అందులో రెండవ ఆహా అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి.
2) అరెరె – అరె + అరె : రెండవసారి వచ్చిన ‘అరె’ ఆమ్రేడితం.
3) ఔరౌర = ఔర + ఔర – రెండవసారి వచ్చిన ‘ఔర’ ఆమ్రేడితం.
గమనిక :
పై ఉదాహరణములలో ఒక్కొక్క పదం రెండుసార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ
గమనిక :
పై ఉదాహరణములలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ వంటి అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే, సంధి వస్తుంది.
ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా ఆహాహా – (ఆ + ఆ = ఆ)
ఓహో + ఓహో : ఓహోహో = (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు : ఎట్లెట్లు = (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
అరె అరె . . అరెరె : (ఎ + అ = అ)
పై విషయాలను గమనిస్తే ఆమ్రేడిత సంధి సూత్రాన్ని ఇలా తయారుచేయవచ్చు.
ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే, సంధి తరుచుగా అవుతుంది.
గమనిక :
అమ్రేడిత సంధి, కింది ఉదాహరణములలో వికల్పంగా జరుగుతుంది. ఈ కింది ఉదాహరణలను గమనిస్తే, సంధి జరిగిన రూపం, సంధిరాని రూపమూ కనబడతాయి.
ఉదా :
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లు, ఎట్లు (సంధి వైకల్పికం)
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత (సంధి వైకల్పికం)
6. ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రం :ఆమ్రేడితం పరమగునపుడు, కడాదుల, తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.
కింది ఉదాహరణలను గమనించండి.
1) పగలు + పగలు = పట్టపగలు
2) చివర + చివర = చిట్టచివర
3) కడ + కడ = కట్టకడ
గమనిక :
1) పగలు + పగలు : పట్టపగలు అవుతోంది. అంటే ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ అన్న అక్షరాలకు బదులుగా, ‘ట్ట’ వచ్చింది. ‘ట్ట’ వచ్చి, ‘పట్టపగలు’ అయింది.
2) చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘మీ’ వచ్చి, ‘చిట్టచివర’ అయింది.
3) కడ + కడ అన్నప్పుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి ‘కట్టకడ’ అయింది. ఇప్పుడు కిందివాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్ట యెదురు
కొన + కొన = కొట్టకొను
మొదట + మొదట = మొట్టమొదట
బయలు + బయలు = బట్ట బయలు
తుద + తుద = తుట్టతుద
గమనిక :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడ మొదలైన శబ్దాల, మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకు ‘ట్ట’ వస్తుండడం గమనించాము.
సూత్రం :
ఆమ్రేడితం పరమగునపుడు, కడాదుల, తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.
7. ద్రుతప్రకృతిక సంధి
సరళాదేశ సంధి : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ఈ కింది పదాలు చదివి పదంలోని చివర అక్షరం కింద గీత గీయండి. 1) పూచెను 2) చూచెన్ 3) తినెను 4) చూచెన్ 5) ఉండెన్
గమనిక :
పై పదాలను గమనిస్తే పదాల చివర, ను, చ్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ‘ద్రుతం’ అంటారు. ద్రుతము చివరన గల పదాలను, “ద్రుత ప్రకృతికములు” అంటారు.
గమనిక :
పూచెను, చూచెన్, తినెను, చూచెన్, ఉండెన్ – అనేవి ద్రుత ప్రకృతికములు.
కింది ఉదాహరణములను గమనించండి.
ఉదా :
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప = పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
ఊ) చేసెను + తల్లీ : చేసెను + దల్లీ
ఋ) దెసను + చూసి = దెసను + జూసి
గమనిక :
ద్రుత ప్రకృతానికి ‘క’ పరమైతే ‘గ’, ‘చ’ పరమైతే ‘జ’, ‘ఓ’ పరమైతే ‘డ’, ‘త’ పరమైతే ‘ద’, ‘ప’ పరమైతే ‘బ’ ఆదేశంగా వస్తాయి.
1) క – ‘గ’ గా,
2) చ – ‘జ’ గా
3) ట – ‘డ’ గా
4) త – ‘ద’ గా
5) ప – ‘బ’ గా మార్పు వచ్చింది.
ఇందులో ‘క చట తప’ లకు, ‘పరుషములు’ అని పేరు, ‘గ జ డ ద బ’ లకు, ‘సరళములు’ అని పేరు. దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది.
సూత్రం :
ద్రుత ప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.
గమనిక :
ఇప్పుడు పై ఉదాహరణలలో మార్పు గమనించండి.
ఉదా :
పూచెఁ గలువలు ; (ద్రుతం అరసున్నగా మారింది)
పూచెను + కలువలు (పూచెం గలువలు (ద్రుతం సున్నగా మారింది) పూచెనలువలు (ద్రుతం మీద హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది) పూచెను గలువలు. ద్రుతము మార్పు చెందలేదు) దీనికి సూత్రం చెపితే సూత్రం ఇలా ఉంటుంది.
2వ సూత్రం : ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి, బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
గమనిక :
అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.
8. గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.
కింది పదాలను ఎలా విడదీశారో గమనించండి.
1) గొప్పవాడు గదా = గొప్పవాడు + కదా (డు + క)
2) కొలువు సేసి = కొలువు + చేసి (వు + చే)
3) వాడు డక్కరి = వాడు + టక్కరి (డు + ట)
4) నిజము దెలిసి = నిజము + తెలిసి (ము + 3)
5) పాలువోయక = పాలు + పోయక (లు + పో)
గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదం చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీద, ప్రత్యయాలు క, చ, ట, త, ప లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తాయి. అంటే
1) క – గ – గా మారుతుంది
2) త – ద – గా మారుతుంది
3) చ – స గా మారుతుంది
4) ప – వ గా మారుతుంది
5) ట – డ గా మారుతుంది.
అంటే క, చ, ట, త, ప లకు, గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి.
గసడదవాదేశ సంధి సూత్రం :
ప్రథమ మీది పరుషములకు గ స డ ద వ లు బహుళంబుగానగు
ద్వంద్వ సమాసంలో : గ స డ ద వా దేశ సంధి.
కింది పదాలను గమనించండి
కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి + లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు + లు
తల్లి దండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె + లు
గమనిక :
పై ఉదాహరణలు ద్వంద్వ సమాసపదాలు. పై ఉదాహరణలలో కూడా క చ ట త ప లకు గ స డ ద వ లు వచ్చాయి.
దీన్నే గ స డ ద వా దేశం అంటారు.
గసడదవాదేశ సంధి సూత్రం :
ద్వంద్వ సమాసంలో మొదటి పదంమీద ఉన్న క చ ట త ప లకు, గ స డ ద వలు క్రమంగా వస్తాయి.
కింది పదాలను కలపండి.
1) అక్క చెల్లి = అక్కాసెల్లెండ్లు
2) అన్న + తమ్ముడు – అన్నదమ్ములు
9. టుగాగమ సంధి
సూత్రం : కర్మధారయంబులందు ఉత్తునకు అచ్చుపరమగునపుడు టుగాగమంబగు.
ఈ కింది పదాలను పరిశీలించండి.
నిలువు + అద్దం = నిలువుటద్దం
తేనె + ఈగ = తేనెటీగ
పల్లె + ఊరు = పల్లెటూరు
గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా చేరింది. ఇలా ‘ట్’ వర్ణం వచ్చే సంధిని ‘టుగాగమ సంధి’ అంటారు.
అలాగే కింది పదాలు కూడా గమనించండి.
1) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
2) పొదరు + ఇల్లు : పొదరుటిల్లు / పొదరిల్లు
గమనిక :
వీటిలో ‘ట్’ అనే వర్ణం, సంధి జరిగినపుడు రావచ్చు. ‘ట్’ వస్తే “టుగాగమం” అవుతుంది. ‘ట్’ రాకుంటే ‘ఉత్వ సంధి’ అవుతుంది.
టుగాగమ సంధి సూత్రం :
కర్మధారయములందు, ఉత్తునకు అచ్చు పరమైతే టుగాగమంబగు.
2) టుగాగమ సంధి (వికల్పం) :
కర్మధారయంబు నందు పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునపుడు టుగాగమంబు విభాషనగు.
ఉదా :
1) పేరు + ఉరము = పేరు టురము / పేరురము
2) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
3) పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు
10. లులన సంధి
సూత్రం : లులనలు పరమైనపుడు ఒక్కొక్కప్పుడు ముగాగమానికి లోపం, దాని పూర్వ స్వరానికి దీర్ఘం వస్తాయి.
ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1) పుస్తకములు – పుస్తకాలు
2) దేశముల – దేశాల
3) జీవితమున – జీవితాన
4) గ్రంథములు – గ్రంథాలు
5) రాష్ట్రముల – రాష్ట్రాల
6) వృక్షమున – వృక్షాన
పై పదాల్లో మార్పును గమనించండి.
పుస్తకములు, గ్రంథములు, దేశములు, రాష్ట్రములు, జీవితమున, వృక్షమున – వీటినే మనం పుస్తకాలు, గ్రంథాలు, దేశాలు, రాష్ట్రాలు, జీవితాన, వృక్షాన అని కూడా అంటాం.
గమనిక :
ఈ మార్పులో లు, ల, న అనే అక్షరాల ముందున్న ‘ము’ పోయింది. ‘ము’ కంటే ముందున్న అక్షరానికి దీర్ఘం వచ్చింది.
లులన సంధి సూత్రం :
లు, ల, న లు పరమైనప్పుడు, ఒక్కొక్కప్పుడు మువర్ణానికి లోపము, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ వస్తాయి.
11. పడ్వాది సంధి
సూత్రం : పడ్వాదులు పరమగునపుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణ బిందువూ (0) విభాషగా అవుతాయి.
ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1) భయము + పడు = భయంపడు, భయపడు
విడదీసిన పదాలకూ, కలిపిన పదాలకూ తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’ కు బదులుగా సున్న(0) వచ్చింది. మరో దానిలో ‘ము’ లోపించింది.
పడ్వాది సంధి సూత్రం :
పడ్వాదులు పరమగునపుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణబిందువూ (0) విభాషగా అవుతాయి.
గమనిక :
పడ్వాదులు = పడు , పట్టె, పాటు అనేవి.
12. త్రికసంధి సూత్రం :
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఈ కింది ఉదాహరణ చూడండి
అక్కొమరుండు = ఆ + కొమరుండు
ఆ + కొమరుడు = అనే దానిలో ‘ఆ’, త్రికంలో ఒకటి. ఇది ‘అ’ గా మారింది. సంయుక్తాక్షరం కాని హల్లు ‘కొ’ ద్విత్వంగా ‘క్కొ’ గా మారింది.
అలాగే ఈ, ఏలు అనే త్రికములు కూడా, ఇ, ఎలుగా మారుతాయి.
ఉదా :
ఈ + కాలము = ఇక్కాలము
ఏ + వాడు : ఎవ్వాడు
త్రికసంధి సూత్రం :
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఉదా :
ఈ + క్కాలము
ఏ + వ్వాడు.
సూత్రం 2 : ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు ఆచ్ఛిక దీర్ఘానికి హ్రస్వం అవుతుంది.
ఉదా :
1) ఇక్కాలము
2) ఎవ్వాడు
13. రుగాగమ సంధి
సూత్రం : పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దము పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
ఉదా :
పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు
పై రెండు పదాలకు మధ్య ” అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలింత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే, ఇలా ‘రుగాగమం” అంటే ‘5’ వస్తుంది.
ఆగమం :
రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే “ఆగమం” అంటారు.
రుగాగమ సంధి సూత్రం (1) :
పేదాది శబ్దములకు ‘ఆలు’ శబ్దంపరమైతే, కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేద (విశేషణం) – ఆలు (స్త్రీ) నామము
విశేషణం = నామం మనుమ + ఆలు = మనుమరాలు బాలింత + ఆలు = బాలింతరాలు
రుగాగమ సంధి సూత్రం (2) :
కర్మధారయంలో తత్సమ పదాలకు, ఆలు శబ్దం పరమైతే, పూర్వ పదం చివరనున్న అత్వానికి ఉత్వమూ, రుగాగమం వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర + ఆలు
గుణవంతురాలు = గుణవంత + ఆలు
విద్యావంతురాలు = విద్యావంత + ఆలు
సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ అనే వర్ణాలకు అవే వర్ణాలు సవర్ణాలు కలిసినప్పుడు, దీర్ఘం తప్పనిసరిగా వస్తుంది.
గమనిక :
‘అ’ వర్ణానికి – ‘అ’, ఆ – లు సవర్ణాలు
‘ఇ’ వర్ణానికి – ‘ఇ, ఈ లు’ – సవర్ణాలు
‘ఉ’ వర్ణానికి – ‘ఉ, ఊ లు’ – సవర్ణాలు
‘ఋ’ వర్ణానికి – ‘ఋ, ౠ లు’ – సవర్ణాలు
ఉదా :
1) రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) రామాలయం = రామ + ఆలయం = అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
3) కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
4) భానూదయం = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
5) వధూపేతుడు = వధూ + ఉపేతుడు : (ఊ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
6) పిత్రణం = పితృ + ఋణం = (ఋ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి
7) మాతౄణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి
2. గుణ సంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = గుణ సంధి
మహేంద్రుడు = మహా + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) = గుణ సంధి
నరేంద్రుడు : నర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణ సంధి
2. ఉదా :
పరోపకారం = పర + ఉపకారం = గుణ సంధి
మహోన్నతి = మహా + ఉన్నతి – (ఆ + ఉ + ఓ) గుణ సంధి
దేశోన్నతి = దేశ + ఉన్నతి = (ఆ + ఉ + ఓ) = గుణ సంధి
గృహోపకరణం = గృహ + ఉపకరణం = (అ + ఉ = ఓ) = గుణ సంధి
3. ఉదా :
రాజర్షి = రాజ + ఋషి – (అ + ఋ = అర్) – గుణ సంధి
మహర్షి = మహా + ఋషి – (ఆ + ఋ = అర్) – గుణ సంధి
గమనిక :
1) అ, ఆ లకు, ఇ, ఈ లు కలిసి ‘ఏ’ గా మారడం
2) అ, ఆ లకు, ఉ, ఊ లు కలిసి ‘ఓ’ గా మారడం
3) అ, ఆ లకు, ఋ, ౠ లు కలిసి ‘అర్’ గా మారడం.
పై మూడు సందర్భాల్లోనూ, పూర్వ స్వరం అంటే, సంధి విడదీసినపుడు, మొదటి పదం చివరి అచ్చు, అ, ఆ లుగా ఉంది. పర స్వరం, అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఇ, ఉ, ఋ – లుగా ఉన్నాయి.
గమనిక :
1) అ, ఆ లకు – ‘ఇ’ కలిస్తే ‘ఏ’ గా మారుతుంది.
2) అ, ఆ లకు – ‘ఉ’ కలిస్తే ‘ఓ’ గా మారుతుంది.
3) అ, ఆ లకు – ‘ఋ’ కలిస్తే ‘అర్’ గా మారుతుంది.
గమనిక :
ఏ, ఓ, అర్ అనే వాటిని గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణ సంధి” అంటారు.
3. యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ, లకు, అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అ) అత్యానందం. = అతి + ఆనందం = (త్ + ఇ + ఆ = యా) = యణాదేశ సంధి
1) అత్యంతం = అతి + అంతం = (అత్ + ఇ + అ + య) = యణాదేశ సంధి
ఉదా :
ఆ) అణ్వస్త్రం = అస్త్రం = (ణ్ + ఉ + అ = వ) = యణాదేశ సంధి
2) గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ . : (ర్ + ఉ + ఆ = వ) = యణాదేశ సంధి
ఉదా :
ఇ) పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = (ఋు + ఆ = రా) = యణాదేశ సంధి
3) మాత్రంశ = మాతృ + అంశ = (ఋ + అ = 6). = యణాదేశ సంధి
గమనిక :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు (వేరే అచ్చులు) పక్కన వచ్చినపుడు, క్రమంగా వాటికి య – వ – ర లు వచ్చాయి. యవరలను ‘యణులు’ అంటారు. యజ్ఞులు చేరితే వచ్చే సంధిని, యణాదేశ సంధి, అంటారు. యణాదేశ సంధిలో, ‘ఇ’ కి బదులుగా “య్”, ‘ఉ’ కి బదులుగా ‘ఏ’, ‘ఋ’ కి బదులుగా ‘5’ వచ్చాయి.
యణాదేశ సంధి సూత్రం : ఇ, ఉ, ఋ లకు, అసవర్ణాచ్చులు పరమైతే, య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
4. వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారము వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
వసుధైక = వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ) = వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
ఆ) సురైక ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఇ) అష్టైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
3. పాపౌఘము = ఓఘము = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఉ) వనౌకసులు = ఓకసులు = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఊ) వనౌషధి = వన ఓషధి = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
4. రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దివ్యాషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనింపదగిన విషయం ఇది.
1. వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వ స్వరంగా ‘అ’ వచ్చింది.
2. పర స్వరం స్థానంలో వరుసగా “ఏ, ఐ, ఓ, ఔ” లు ఉన్నాయి.
3. అకారానికి ఏ, ఐ లు కలిపినపుడు ‘ఐ’ వచ్చింది.
4. అకారానికి ఓ, ఔ లు కలిపినపుడు ‘ఔ’ వచ్చింది.
వృద్ధి సంధి సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైనపుడు ఐకారమూ, ఓ, ఔ లు పరమైతే ఔ కారమూ వస్తాయి.
వృద్ధులు = ఐ, ఔ లను ‘వృద్ధులు’ అంటారు.
5. జశ్వ సంధి
సూత్రం : “పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శ ష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.
ఉదా :
సత్ + భక్తులు = సద్ + భక్తులు = సద్భక్తులు
పై సంధి పదాలను పరిశీలించండి. మొదట విడదీసిన పదాలలోని ‘త’ కార స్థానములో ‘ద’ కారం ఆదేశంగా వచ్చి, ‘సద్భక్తులు’ అనే రూపం వచ్చింది.
గమనిక :
ఈ విధంగా మొదటి పదం చివర, క, చ, ట, త, ప (పరుషాలు) లలో ఏదైనా ఒక అక్షరం ఉండి, రెండవ పదం మొదట క ఖ, చ ఛ, ట ఠ, త థ, ప ఫ, లు మరియు శ ష స లు తప్ప, మిగిలిన హల్లులూ, అచ్చులలో ఏ అక్షరం ఉన్నా ‘గ, జ, డ, ద, బ’ లు వరుసగా ఆదేశం అవుతాయి.
కింది పదాలను విడదీయండి.
1) దిగంతము = దిక్ + అంతము = జశ్వ సంధి
2) మృదటము = మృత్ + ఘటము = జశ్వ సంధి
3) ఉదంచద్భక్తి = ఉదంచత్ + భక్తి = జశ్వ సంధి
4) వాగీశుడు = వాక్ + ఈశుడు = జశ్వ సంధి
5) వాగ్యుద్ధం = వాక్ + యుద్ధం = జ్వ సంధి
6) వాగ్వాదం = వాక్ + వాదం = జశ్వ సంధి
7) తద్విధం = తత్ + విధం = జశ్వ సంధి
జశ్వసంధి సూత్రం :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.
సమాసాలు
సమాసం :
వేరు వేరు అర్థాలు కల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.
గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, క్రొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని “ఉత్తరపదం” అంటారు.
ఉదా :
‘రామ బాణము’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వపదము. ‘బాణము’ అనేది ఉత్తరపదము.
ద్వంద్వ సమాసం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని, నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని “ద్వంద్వ సమాసం” అంటారు. (సమాసంలోని రెండు పదముల అర్థానికి ప్రాధాన్యం కల సమాసము ద్వంద్వ సమాసము.)
ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.
1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు
2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు.
3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు
I. ఈ కింది ద్వంద్వ సమాసాలను వివరించండి. విగ్రహవాక్యం రాయండి.
సమాస పదాలు | విగ్రహవాక్యాలు |
1) ఎండవానలు | ఎండా, వానా |
2) తల్లిదండ్రులు | తల్లి, తండ్రి |
3) గంగా యమునలు | గంగ, యమున |
II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
విగ్రహవాక్యం | సమాసపదం |
1) కుజనుడూ, సజ్జనుడూ | కుజన జనులు |
2) మంచి, చెడూ | మంచిచెడులు |
3) కష్టమూ, సుఖమూ | కష్టసుఖములు |
2. ద్విగు సమాసం: సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసాలు అంటారు.
అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :
నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2) దశావతారాలు — దశ (10) సంఖ్య గల అవతారాలు
3) ఏడురోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4) నాలుగువేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు
గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు”.
3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.
అభ్యాసం :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాయండి.
సమాసం | విగ్రహవాక్యం |
1) రాజభటుడు | రాజు యొక్క భటుడు |
2) తిండి గింజలు | తిండి కొఱకు గింజలు |
3) పాపభీతి | పాపము వల్ల భీతి |
గమనిక :
‘రాజ భటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ అనే పదం ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే, ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు, రాజుకు చెందినవాడు అని చెప్పడానికి ష విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు”.
గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.
తత్పురుష సమాసం రకాలు | విభక్తులు | ఉదాహరణ, విగ్రహవాక్యం |
1) ప్రథమా తత్పురుష సమాసం | డు, ము, వు, లు | మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య |
2) ద్వితీయా తత్పురుష సమాసం | ని, ను, ల, కూర్చి, గురించి | జలధరం – జలమును ధరించినది |
3) తృతీయా తత్పురుష సమాసం | చేత, చే, తోడ, తో | బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు |
4) చతుర్థి తత్పురుష సమాసం | కొఱకు, కై | వంట కట్టెలు – వంట కొఱకు కట్టెలు |
5) పంచమీ తత్పురుష సమాసం | వలన, (వల్ల) కంటె, పట్టి | దొంగభయం – దొంగ వల్ల భయం |
6) షష్ఠీ తత్పురుష సమాసం | కి, కు, యొక్క లో, లోపల | రామబాణం – రాముని యొక్క బాణం |
7) సప్తమీ తత్పురుష సమాసం | అందు, న | దేశభక్తి – దేశము నందు భక్తి |
8) నఞ్ తత్పురుష సమాసం | నఞ్ అంటే వ్యతిరేకము | అసత్యం – సత్యం కానిది |
అభ్యాసం : కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.
సమాసం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
అ) రాజ పూజితుడు | రాజుచే పూజితుడు | తృతీయా తత్పురుషము |
ఆ) ధనాశ | ధనము నందు ఆశ | సప్తమీ తత్పురుషము |
ఇ) పురజనులు | పురమందు జనులు | సప్తమీ తత్పురుషము |
ఈ) జటాధారి | జడలను ధరించినవాడు | ద్వితీయా తత్పురుషము |
ఉ) భుజబలం | భుజముల యొక్క బలం | షష్ఠీ తత్పురుషము |
ఊ) అగ్నిభయం | అగ్ని వల్ల భయం | పంచమీ తత్పురుషము |
ఋ) అన్యాయం | న్యాయం కానిది | నఞ్ తత్పురుష సమాసం |
తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1) మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగము)
2) పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగము)
గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము.
కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2) నఞ్ + భయం = అభయం – భయం కానిది
3) నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4) నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది
గమనిక :
సంస్కృతంలో ‘నః’ అనే అవ్యయం వ్యతిరేకార్థక బోధకము. దీనికి బదులు తెలుగులో అ, అన్, అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నఞ్’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు. అభ్యాసము : కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామము పేర్కొనండి.
సమాసం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
అ) అర్ధ రాత్రి | రాత్రి యొక్క అర్ధము | ప్రథమా తత్పురుషము |
ఆ) అనూహ్యము | ఊహ్యము కానిది | నఞ్ తత్పురుషము |
ఇ) అక్రమం | క్రమము కానిది | నఞ్ తత్పురుషము |
ఈ) అవినయం | వినయం కానిది | నఞ్ తత్పురుషము |
4. కర్మధారయ సమాసం :
‘నల్లకలువ’ అనే సమాస పదంలో ‘నల్ల’, ‘కలువ’ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది, “విశేషణం”. రెండో పదం ‘కలువ’ అనేది, “నామవాచకం”; ఇలా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే, దాన్ని కర్మధారయ సమాసం అంటారు.
4. అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే, ఆ సమాసాన్ని ‘విశ్లేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) తెల్ల గుర్రం – తెల్లదైన గుర్రం.
తెలుపు (విశేషణం) (పూర్వపదం) – (మొదటి పదం) గుర్రం – నామవాచకం (ఉత్తరపదం) – రెండవ పదం
4. ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘మామిడి గున్న’ అనే సమాసంలో, మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ నామవాచకం, రెండో పదం (ఉత్తరపదం) గున్న అనేది విశేషణం. ఇందులో విశేషణమైన ‘గున్న’ అనే పదం ఉత్తరపదంగా – అంటే రెండో పదంగా ఉండడం వల్ల, దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు.
అభ్యాసం :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాసి, ఏ సమాసమో రాయండి.
1) పుణ్యభూమి – పుణ్యమైన భూమి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు – మంచి వాడైన రాజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొత్త పుస్తకం – కొత్తదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) పురుషోత్తముడు – ఉత్తముడైన పురుషుడు – విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
4.ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘తమ్మివిరులు’ అనే సమాసంలో, మొదటి పదమైన ‘తమ్మి’, ఏ రకం విరులో తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం, నదులు, వృక్షములు, ప్రాంతాలు, మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని ‘సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
మఱ్ఱి చెట్టు – మట్టి అనే పేరుగల చెట్టు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
గంగానది – గంగ యనే పేరుగల నది – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – ‘భారతము’ అనే పేరుగల దేశం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
4.ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
‘కలువ కనులు’ అనే సమాసంలో కలువ, కనులు అనే రెండు పదాలున్నాయి. దీనికి ‘కలువల వంటి కన్నులు’ అని అర్థం. అంటే కన్నులను కలువలతో పోల్చడం జరిగింది. సమాసంలోని మొదటి పదం
(పూర్వపదం) ఇక్కడ ‘ఉపమానం’ కాబట్టి దీన్ని “ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.
4.ఉ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘పదాబ్జము’ అనే సమాసంలో పద (పాదం) మరియు, అబ్జము (పద్మం) అనే రెండు పదాలున్నాయి. వీటి అర్థం పద్మము వంటి పాదము అని. ఇక్కడ పాదాన్ని పద్మం (తామరపూవు)తో పోల్చడం జరిగింది. కాబట్టి పాదం ఉపమేయం. పద్మం ఉపమానం. ఉపమానమైన అబ్జము అనే పదం, ఉత్తరపదంగా (రెండవపదం) గా ఉండడం వల్ల దీన్ని “ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం” అంటారు.
అభ్యాసము :
కింది సమాసములకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామములు పేర్కొనండి.
సమాసం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1) తేనెమాట | తేనె వంటి మాట తేనె – ఉపమానం; మాట – ఉపమేయం |
ఉపమాన పూర్వపద కర్మధారయం |
2) తనూలత | లత వంటి తనువు తనువు – ఉపమేయం; లత – ఉపమానం |
ఉపమాన ఉత్తరపద కర్మధారయం |
3) చిగురుకేలు | చిగురు వంటి కేలు చిగురు – ఉపమానం; కేలు – ఉపమేయం |
ఉపమాన పూర్వపద కర్మధారయం |
4) కరకమలములు | కమలముల వంటి కరములు కరములు – ఉపమేయం కమలములు – ఉపమానం |
ఉపమాన ఉత్తరపద కర్మధారయం |
5. రూపక సమాసం :
‘విద్యాధనం’ – అనే సమాసంలో విద్య, ధనం అనే రెండు పదాలున్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం కనుక, ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనంత గొప్పగా చెప్పబడింది. ఈ విధంగా ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు చెబితే అది ‘రూపక సమాసం’.
ఉదా :
1) హృదయ సారసం – హృదయం అనెడి సారసం
2) సంసార సాగరం – సంసారం అనెడి సాగరం
3) జ్ఞాన జ్యోతి – జ్ఞానము అనెడి జ్యోతి
4) అజ్ఞాన తిమిరం – అజ్ఞానము అనెడి తిమిరం
6. బహుప్రీహి సమాసం : అన్య పదార్థ ప్రాధాన్యం కలది.
కింది ఉదాహరణను గమనించండి.
చక్రపాణి – చక్రము పాణియందు (చేతిలో) కలవాడు. ‘విష్ణువు’ అని దీని అర్థము. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు అనగా “చక్రానికి” కాని “పాణికి” కాని ప్రాధాన్యం లేకుండా, ఆ రెండూ మరో అర్థం ద్వారా “విష్ణువును” సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా, అన్యపదముల అర్థాన్ని స్ఫూరింప జేసే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్య పదార్థ ప్రాధాన్యం కలది. ‘బహుబ్లిహి సమాసం’.
అభ్యాసం :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1) నీలవేణి – నల్లని వేణి కలది – బహుప్రీహి సమాసం
2) నీలాంబరి – నల్లని అంబరము కలది – బహుప్రీహి సమాసం
3) ముక్కంటి – మూడు కన్నులు గలవాడు – బహుప్రీహి సమాసం
4) గరుడవాహనుడు – గరుత్మంతుడు వాహనంగా గలవాడు – బహుప్రీహి సమాసం
5) దయాంతరంగుడు – దయతో కూడిన అంతరంగము కలవాడు – బహుప్రీహి సమాసం
6) చతుర్ముఖుడు – నాలుగు ముఖములు గలవాడు – బహుబ్రీహి సమాసం
సమాపక – అసమాపక క్రియలు
ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.
1) ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
2) వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది.
3) అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు.
అ) సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతివాక్యం చివరన ఉన్న వెళ్ళాడు, పెట్టాడు వంటి క్రియలు పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని సమాపక క్రియలు అంటారు.
ఆ) అసమాపక క్రియలు :
వాక్యం మధ్యలో ఉన్న ‘చేసి’ ‘గీసి’ ‘చదివి’ – అన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. వీటిని అసమాపక క్రియలు అంటారు.
ఇ) అసమాపక క్రియా – భేదములు
1) క్వార్ధకం : (భూతకాలిక అసమాపక క్రియ)
భాస్కర్ ఆట ఆడి, అలసిపోయి ఇంటికివచ్చాడు. ఈ వాక్యంలో భాస్కర్ ‘కర్త’. ‘వచ్చాడు’ అనేది కర్త్య. వాచకానికి చెందిన ప్రధాన క్రియ.
ఆడి, అలసి అనేవి కర్బవాచక పదానికి చెందిన ఇతరక్రియలు. ఆడి, అలసి అనే పదాలు క్రియలే కాని, వాటితో పూర్తి భావం తెలియడం లేదు. ఆడి, అలసిపోయి అనే క్రియల తర్వాత, ఏం చేస్తాడు ? అనే ప్రశ్న వస్తోంది. ఆడి, అలసిపోయి అనే క్రియలు, భూతకాలంలోని పనిని సూచిస్తున్నాయి. వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, ‘క్వార్థకం’ అని పిలుస్తారు.
ఈ క్రియలన్నీ ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే చివరి – ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం ‘క్వార్థం’.
ఉదాహరణలు :
పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఇందులో ‘తిని’ అనేది క్త్వార్థం (అసమాపక క్రియ).
2) శత్రర్థకం : (వర్తమాన అసమాపక క్రియ)
అఖిలేశ్ మధుకర్ తో ‘మాట్లాడుతూ’ నడుస్తున్నాడు. ఈ వాక్యంలో ‘నడుస్తున్నాడు’ అనే ప్రధానక్రియకు, ‘మాట్లాడుతూ అనే ఉపక్రియ వర్తమాన కాలంలో ఉండి, అసమాపక క్రియను సూచిస్తుంది.
ఈ విధంగా ‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల వర్తమాన అసమాపక క్రియగా మారుతుంది. వర్తమాన అసమాపక క్రియను ‘శత్రర్థకం’ అంటారు.
ఉదా :
1) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది.
2) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.
గమనిక :
పై వాక్యాలలో 1) చదువుతూ 2) ఆలోచిస్తూ అనేవి శత్రర్థకములు.
3) చేదర్థకం : (ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.)
కింది వాక్యం చదవండి.
“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.”
పై వాక్యంలో ప్రధాన క్రియ ‘వస్తుంది’ – ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఈ ఫలితం రావాలంటే షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ చేస్తే ఇది కారణం. అది కార్యం . ఈ విధంగా సంక్లిష్ట వాక్యాల్లో ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియ ‘చేదర్థకం’ అంటారు. చేత్ అర్థాన్ని ఇచ్చేది – చేదర్థకం. వీటిలో ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.
అభ్యాసం :
ఈ కింది వాక్యంలోని అసమాపక క్రియలను రాయండి.
1) రమ రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
జవాబు:
తీసి, వేసి, ఎక్కి అనేవి ‘క్వార్థం’ అనే అసమాపక క్రియలు.
తధర్మ క్రియలు :
ఒక వస్తువు స్వభావాన్నీ, ధర్మాన్ని తెలిపే క్రియలనూ, నిత్య సత్యాలను తెలిపే వాటినీ, ‘తద్దర్మ క్రియలు’ అంటారు.
ఉదా :
1) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
2) సూర్యుడు పడమట అస్తమిస్తాడు.
3) పక్షి ఆకాశంలో ఎగురుతుంది.
ప్రశ్నా వాక్యాలు :
ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నా వాక్యంగా మార్చవచ్చు.
ఉదా :
1) మీరు బడికి వెళతారా?
2) దైన్య స్థితిని చూస్తారా?
అభ్యాసం :
కింది వాటిని జతపరచండి.
1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి | అ) చేదర్థకం |
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో | ఆ) శత్రర్థకం |
3) మానసికంగా ఎదిగినట్లైతే | ఇ) ప్రశ్నార్థకం |
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా | ఈ) క్వార్ధకం |
జవాబు:
1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి | ఈ) క్వార్ధకం |
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో | ఆ) శత్రర్థకం |
3) మానసికంగా ఎదిగినట్లైతే | అ) చేదర్థకం |
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా | ఇ) ప్రశ్నార్థకం |
వాక్య భేదములు
వాక్యాలు మూడు రకములు.
1) సామాన్య వాక్యం 2) సంక్లిష్ట వాక్యం 3) సంయుక్త వాక్యం
1) ఉష పాఠం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.
1) సామాన్య వాక్యం :
గమనిక :
మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియలేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.
2) సంక్లిష్ట వాక్యం :
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2) శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)
గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలను ‘సంక్లిష్ట వాక్యాలు’ అంటారు.
3) సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను ‘సంయుక్త వాక్యాలు’ అంటారు.
ఉదా :
1) సీత చదువుతుంది, పాడుతుంది.
2) అతడు నటుడు, రచయిత.
3) అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.
సామాన్య వాక్యాలు :
అ) రాజు అన్నం తిన్నాడు
ఆ) గోపి పరీక్ష రాశాడు
ఇ) గీత బడికి వెళ్ళింది
గమనిక :
పై వాక్యాల్లో తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే, ఆ వాక్యాలను ‘సామాన్య వాక్యాలు’ అంటారు.
కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని.
సంక్లిష్ట వాక్యాలు :
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
గమనిక :
పై సామాన్య వాక్యాలలో రెంటిలోనూ ‘గీత’ అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ లోని క్రియ ‘వెళ్ళింది’ అనే దాన్ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.
ఉదా :
గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది. (సంక్లిష్ట వాక్యం)
అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) 1) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది (సంక్లిష్ట వాక్యం)
ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం)
అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
1) తాత భారతం చదివి, నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)
2) చెట్లు పూత పూస్తే, కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
చెట్లు పూత పూయాలి. చెట్లు కాయలు కాయాలి. (సామాన్య వాక్యాలు)
3). రాముడు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)
అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది. (సంక్లిష్ట వాక్యం)
2) మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది. (సంక్లిష్ట వాక్యం)
3) నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతాడు. (సంక్లిష్ట వాక్యం)
అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. (సామాన్య వాక్యాలు)
2) రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రజియా పాట పాడుతుంది. రజియా ఆడుకుంటున్నది. (సామాన్య వాక్యాలు)
సంయుక్త వాక్యం :
కింది వాక్యాలను గమనించండి.
విమల తెలివైనది. విమల అందమైనది – విమల తెలివైనది, అందమైనది.
ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి, ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు.
సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు వచ్చే మార్పులు :
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది
వనజ చురుకైనది, అందమైనది (రెండు నామపదాల్లో ఒకటి లోపించడం)
ఆ) అజిత అక్క. శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కా చెల్లెళ్ళు. (రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది)
ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా? ప్రొఫెసరా? (రెండు సర్వనామాల్లో ఒకటి లోపించింది)
అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1) ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు (సామాన్య వాక్యాలు)
జవాబు:
ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు. (సంయుక్త వాక్యం)
2) మోహన కూచిపూడి నృత్యం. నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. (సంయుక్త వాక్యం)
అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1) చుక్క పొడుపుతో సీత లేచింది. సీత గడపను పూజించింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీత చుక్క పొడుపుతో లేచి, గడపను పూజించింది. (సంక్లిష్ట వాక్యం)
2) బంధుమిత్రులంతా వచ్చేశారు. కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
బంధుమిత్రులంతా వచ్చి, ‘కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సంక్లిష్ట వాక్యం)
అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1) సీతక్క నిశ్చితార్థం జరిగింది. నాగయ్య సంబరపడ్డాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క నిశ్చితార్థం జరిగింది, కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు. (సంయుక్త వాక్యం)
2) సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు. సీతమ్మ పెండ్లి పెటాకులయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు, కాని పెండ్లి పెటాకులయ్యింది. (సంయుక్త వాక్యం)
అభ్యాసం :
కింది వాటిని సంయుక్త వాక్యాలుగా రాయండి.
1) బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది.
జవాబు:
బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది. (సంయుక్త వాక్యం)
2) లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది. లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకున్నాడు.
జవాబు:
లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది కాబట్టి లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకున్నాడు. (సంయుక్త వాక్యం)
(అ) రెండు గాని, అంతకంటే ఎక్కువగాని వాక్యాలలోని సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి, ఆ వాక్యాలను ఒకే వాక్యంగా రాస్తే దాన్ని, సంక్లిష్ట వాక్యం అంటారని మీరు తెలుసుకున్నారు.
అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాయుచున్నారు. ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు. (సామాన్య వాక్యం)
జవాబు:
ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ ఆంగ్లేయ ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు. (సంక్లిష్ట వాక్యం)
2) నన్ను మీరు క్షమించవలయును. మఱియెప్పుడైన ఈ సభ తిరుగఁజేసి కొనుడు.
జవాబు:
నన్ను మీరు క్షమించి మటియెప్పుడైన ఈ సభ తిరుగజేసికొనుడు (సంక్లిష్ట వాక్యం)
అభ్యాసం :
కింది వాక్యాన్ని పరిశీలించి, అది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. క్రియా భేదాలను కూడా గుర్తించండి.
1) రమ రోడ్డు మీద ఉన్న కాగితం ముక్కను తీసి, దగ్గరలోనున్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది. (ఇ)
అ) సామాన్య
ఆ) సంయుక్త
ఇ) సంక్లిష్ట
పై వాక్యంలో ఉన్న అసమాపక క్రియలను రాయండి.
జవాబు:
1) తీసి
2) వేసి
3) ఎక్కి
2. ప్రశ్నార్థక వాక్యం : ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఎవరు? ఏమిటి? అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారు చేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. ఇలాంటి ప్రశ్నావాక్యాలను రకానికి ఒకటి చొప్పున మీ పాఠ్యపుస్తకం నుంచి ఉదాహరణలు వెతికి రాయండి.
ఉదా :
దైన్యస్థితిని చూస్తారు + ఆ = దైన్యస్థితిని చూస్తారా?
జవాబు:
1) మీరెప్పుడైనా గమనించారా? (గమనించారు + ఆ)
2) మీరు గమనిస్తారా? (గమనిస్తారు + ఆ)
3) వీటిని మీరు చూపిస్తారా? (చూపిస్తారు + ఆ)
4) నిజంగా మీరు చూస్తుంటారా? (చూస్తుంటారు + ఆ)
5) శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? (తెలుసు + ఆ)
6) ఇంట్లకెట్ల ఆ పిల్లగాడు వొచ్చిండో? (వొచ్చిండు + ఓ)
7) అట్టి ప్రసిద్ధములైన కార్యముల జేయగలిగెడి వారేనా? (వారేను + ఆ)
I. క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1) పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒకనెల రోజుల వ్యవధి కావాలి.
జవాబు:
పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెల రోజుల వ్యవధి అక్కర్లేదు. (వ్యతిరేక వాక్యం )
2) నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోలేకపోయాను.
జవాబు:
నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోగలిగాను. (వ్యతిరేకార్థక వాక్యం)
II. కింది వానికి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.
1) ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు.
జవాబు:
ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది. (వ్యతిరేకార్థక వాక్యం)
2) రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడ్డాడు.
జవాబు:
రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడలేదు. (వ్యతిరేకార్థక వాక్యం)
3) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు.
జవాబు:
నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు. (వ్యతిరేకార్థక వాక్యం)
4) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడలేదు.
జవాబు:
ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది. (వ్యతిరేకార్థక వాక్యం)
కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు
1) కింది వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి.
అ) సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.
గమనిక :
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కాని వాక్య నిర్మాణంలో తేడా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య భేదం ఇది.
1) “సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు”.
1) కర్తరి వాక్యం :
ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ, కర్తను సూచిస్తుంది. కర్మకు, ద్వితీయా విభక్తి చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం ‘ అంటారు.
2) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. అనే రెండవ వాక్యంలో 1) కర్తకు తృతీయా విభక్తి ఉంది.
2) క్రియకు ‘బడు’ అనే ధాతువు చేరింది 3) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.
2) కర్మణి వాక్యం :
వాక్యంలో క్రియకు ‘బడు’ ధాతువు చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని ‘కర్మణి వాక్యం’ అంటారు.
అభ్యాసం – 1 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)
ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)
అభ్యాసం – 2 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)
ఆ) నాచే రచింపబడిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను రచించిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)
అభ్యాసం – 3 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
ఆళ్వారు స్వామి చిన్నప్పుడే కథ రాశారు. (కర్తరి)
జవాబు:
చిన్నప్పుడే ఆళ్వారు స్వామిచే కథ రాయబడింది. (కర్మణి)
అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఉసిరికాయ తీసి, లింగయ్య చేత నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)
ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పిల్లలతో నాయకులచేత అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)
ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)
అభ్యాసం – 4 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకుపోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని తీసుకుపోయారు. (కర్తరి వాక్యం)
ఆ) కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలు అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)
ఇ) బాలురచే సెలవు తీసికోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసికొన్నారు. (కర్తరి వాక్యం)
కర్తరి, కర్మణి వాక్యాలు
కర్తరి వాక్యం :
జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు.
కర్మణి వాక్యం :
ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి.
గమనిక :
పై రెండు వాక్యాలలో కర్తరి వాక్యం మనకు సూటిగా అర్థం అవుతుంది. ఇది సహజంగా ఉంటుంది. కర్మణి వాక్యం చుట్టు తిప్పినట్లు ఉంటుంది. మన తెలుగు భాషలో వాడుకలో ప్రధానంగా కర్తరి వాక్యమే ఉంటుంది.
కర్మణి వాక్యప్రయోగాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చాయి. ఇంగ్లీషు వాక్య పద్ధతి ఇలాగే ఉంటుంది.
1) కర్తరి వాక్యమును ఇంగ్లీషులో (Active voice) అంటారు.
2) కర్మణి వాక్యమును. ఇంగ్లీషులో (Passive voice) అంటారు.
అభ్యాసం :
కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.
1) రమేష్ భారతాన్ని చదివాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రమేష్ చే భారతం చదువబడింది. (కర్మణి వాక్యం )
2) నేనెన్నో పుస్తకాలు రాశాను. (కర్తరి వాక్యం)
జవాబు:
ఎన్నో పుస్తకాలు నాచేత రాయబడ్డాయి. (కర్మణి వాక్యం )
ప్రత్యక్ష, పరోక్ష కథనాలు
అభ్యాసం :
కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి.
1) ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంలో పై సభ జరుపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యం, పై సభను జరిపింది. (కర్తరి వాక్యం)
2) తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమింపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
తిరువాన్కూరులో ఒక స్త్రీని మంత్రిణిగా నియమించారు. (కర్తరి వాక్యం)
3) విద్యా సంఘాలలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
విద్యా సంఘాలలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు. (కర్తరి వాక్యం)
ప్రత్యక్ష కథనం :
కింది వాక్యాలు చదవండి.
1. “నన్ను ఉపన్యాసరంగము నొద్దకు దీసికొనిపోయిరి.”
2. “నేనిట్లు ఉపన్యసించితిని.”
3. “నాయనలారా ! నేను మీ సభా కార్యక్రమమునంతయు జెడగొట్టితిని.”
4. “నన్ను మీరు క్షమింపవలయును.”
పై వాక్యాలన్నీ జంఘాల శాస్త్రి నేరుగా చెబుతున్నట్లు ఉన్నాయి కదా !
నేను, మేము, …… ఇలా ఉండే వాక్యాలు అనగా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి.
అట్లే కింది వాక్యాలను చదవండి.
1) “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.
2) “నేను రాను” అని నరేశ్ రఘుతో అన్నాడు.
(లేదా)
“నేను రా”నని నరేశ్ రఘుతో అన్నాడు. పై వాక్యాలలో గీత గీసిన మాటలను ఎవరు అన్నారు?
మొదటి దాంట్లో జంఘాలశాస్త్రి అన్న మాటలను, రెండవదాంట్లో నరేశ్ అన్న మాటలను “ఉద్ధరణ చిహ్నాలు” (ఇన్వర్టర్ కామాలు) ఉంచి చెప్పారు కదా ! ఇలా నేరుగా చెప్పదల్చుకున్న అంశాలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి చెప్పినపుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది.
ఈ విధంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.
అభ్యాసం – 1 : పరోక్ష కథనంలోకి మార్చండి.
1) “ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త” అని అతడినే బెదరించింది మెల్లీ. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
మెల్లీ అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందని అతడినే బెదరించింది. (పరోక్ష కథనం)
2) “చిన్నప్పటి నుండి నాకు బోటనీ విషయం అభిమాన విషయం” అన్నాడు రచయిత. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
రచయిత చిన్నప్పటి నుండి తనకు బోటనీ విషయం అభిమాన విషయమని అన్నాడు. (పరోక్ష కథనం)
అభ్యాసం – 2 : పరోక్ష కథనంలోకి మార్చండి.
1) “మా అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది” అన్నారు కలామ్. (ప్రత్యక్ష కథనం)
జవాబు:
తన అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు. (పరోక్ష కథనం)
పరోక్ష కథనం :
కింది వాక్యాలు చదవండి.
1. నరేశ్ తాను రానని రఘుతో అన్నాడు.
2. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు.
3. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాను.
పై వాక్యాలను చదివారు కదా ! ఇవి నేరుగా చెబుతున్నట్లుగా ఉన్నాయా?
ఉత్తమ పురుషలో కాకుండా, ఇంకొకరు చెబుతున్నట్లుగా ఉన్నాయా?
ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనం అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు.
ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చడం. కింది వాక్యాలను చదవండి. ఏం మార్పు జరిగిందో చెప్పండి.
1. “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.
2. తానొక్కడే అదృష్టవంతుడా అని జంఘాల శాస్త్రి అన్నాడు.
మొదటి వాక్యంలో జంఘాలశాస్త్రి మాట్లాడిన మాటలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి రాశారు. రెండో వాక్యంలో జంఘాల శాస్త్రి అన్నమాటలను ఇంకొకరు చెప్పినట్లుగా రాశారు. ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసివేసి “అని” చేర్చి వాక్యాన్ని రాసారు. కాబట్టి మొదటి వాక్యం ప్రత్యక్ష కథనంలో ఉంటే, రెండవ వాక్యం పరోక్ష కథనంలోకి మారింది. ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు పరోక్ష కథనంలోకి మారేటపుడు కింది మార్పులు చోటు చేసుకుంటాయి.
మాటలు / వాక్యంలోని భావాన్ని స్వీకరిస్తారు. ఉద్ధరణ చిహ్నాలు తొలగించి ‘అని’ చేరుస్తారు. ఉత్తమ పురుషపదాలు అనగా నేను, మేము వంటివి, ప్రథమ పురుషలోకి అనగా తను, తమ, తాను, తాములాగా మారుతాయి.
1. పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.
2. మీరే మరికొన్ని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు రాయండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చండి.
అలంకారాలు
అలంకారం : చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు :
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు
అ) శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు”.
కింది గేయాన్ని గమనించండి. “అది గదిగో మేడ
మేడకున్నది గోడ
గోడ పక్కని నీడ
నీడలో కోడె దూడ
దూడ వేసింది పేడ
పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది) ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం వినసొంపు, ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.
1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు, వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి రామకథయే రక్తి
ఓ కూనలమ్మ”
గమనిక :
పై కవితలో ప్రతివాక్యం చివర ‘కీ’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.
2) ‘గుండెలో శూలమ్ము గొంతులో శల్యమ్ము పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతిపాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.
1. అంత్యాను ప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని ‘అంత్యానుప్రాసాలంకారం’ అంటారు.
కింది గేయాలు గమనించండి :
1) “వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర, ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ, ఉంది. కాబట్టి అంత్యానుప్రాసాలంకారం దీనిలో ఉంది. ‘తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.
2. వృత్త్యను ప్రాసాలంకారం :
అక్షరం అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే, మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా ? నీవు నన్నే మన్నా అన్నావా?
గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాస’ అనే శబ్దాలంకారం.
అభ్యాసము :
1) కా కి కో కి ల కాదు కదా !
2) లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది.
గమనిక :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ‘వృత్త్యనుప్రాసాలంకారం.
ఈ కింది వాక్యాలు చూడండి.
1) ఆమె కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది.
2) చిట పట చినుకులు ట ప ట ప మని పడుతున్నవేళ
గమనిక :
మొదటి వాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి. ఈ ఉదాహరణలు కూడా చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా.
గమనిక :
ఈ విధంగా ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే,
దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.
3. ఛేకాను ప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.
పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరుసంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’, వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.
ఛేకాను ప్రాస (లక్షణం) :
హల్లుల జంట, అర్థభేదంతో వెంట వెంటనే వస్తే, దానిని ‘ఛేకానుప్రాస అలంకారం అంటారు.
ఛేకానుప్రాసకు మరికొన్ని ఉదాహరణములు :
1) పాప సంహరుడు హరుడు
అర్థాలంకారాలు :
1. ఉపమాలంకారం :
1) ఆమె ముఖం అందంగా ఉంది.
2) ఆమె ముఖం, చంద్రబింబంలాగ అందంగా ఉన్నది.
గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉంది. అనే వాక్యం మనలను ఆకట్టుకుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి, అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడివలె బలవంతుడు. గమనిక : ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)
* ఉపమాలంకారం (లక్షణం) :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారం’.
2. ఉత్ప్రేక్షాలంకారం : ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం, “ఉత్ప్రేక్షాలంకారం”.
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.
గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా, ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :
1) ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయో అన్నట్లు ఉన్నవి.
2) ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.
పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)
అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారము”.
3. రూపకాలంకారం (లక్షణం) :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే, రూపకాలంకారం అంటారు.
ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయం.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)
ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ, మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.
అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.
1) మా అన్న చేసే వంట నలభీమపాకం
2) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం
గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికి భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికీ భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.
1) లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లారు.
2) రుద్రమ్మ చండీశ్వరీ దేవి జల జలా పారించె శాత్రవుల రక్తమ్ము.
3) ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
3) మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
4) మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.
గమనిక :
పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.
4. దృష్టాంతాలంకారం :
వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఒక భావం అర్థం గావటానికి మరో భావం అద్దంలో చూపించినట్లు ఉంటే దాన్ని ‘దృష్టాంతాలంకారం’ అంటారు.
ఉదా :
“ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతి మంతుడు”.
5. అతిశయోక్తి అలంకారం :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
కింది వాక్యాన్ని గమనించండి.
ఉదా :
ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాము.
5. అతిశయోక్తి అలంకారం : (లక్షణం) :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పటం.
6. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని ‘స్వభావోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరిచూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.
స్వభావోక్తికి మరియొక ఉదాహరణము :
1) ఆ లేళ్ళు బెదురుచూపులతో నిక్కపొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.
సమన్వయం :
ఇక్కడ లేళ్ళ యొక్క సహజగుణాన్ని ఉన్నది, ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది ‘స్వభావోక్తి’ అలంకారము.
“మునుమును బుట్టె నాకు నొక ముద్దుల పట్టి, యతండు పుట్టి యే
డెనిమిది నాళ్ళపాటి గలఁడింతియ, పూరియు మేయనేరడేఁ
జని, కడుపారఁ జన్లుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టికొనవన్న! దయాగుణ ముల్లసిల్లఁగన్”
గమనిక :
పై పద్యంలో గోవు యొక్క కొడుకు మొన్నమొన్ననే పుట్టాడని, ముద్దుముద్దుగా ఉంటాడని, ఏడెనిమిది రోజుల వయస్సు కలవాడని, కొద్దిగా కూడా గడ్డిని తినలేడని ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదజాలంతో వర్ణించారు. కనుక ఇక్కడ ‘స్వభావోక్తి’ అలంకారం ఉంది.
ఛందస్సు
కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమములకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.
1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు”. హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.
2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు”.
గురులఘువుల గుర్తులు
లఘువు అని తెలుపడానికి గుర్తు : I
గురువు అని తెలుపడానికి గుర్తు : U
గురులఘువుల నిర్ణయము
ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధము.
బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం :
గమనిక :
గురువులు కాని, అక్షరాలన్నీ లఘువులు :
గణ విభజన
1) ఒకే అక్షరం గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
2) రెండక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.
అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.
ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిపి గణంగా ఏర్పడితే అది ‘లగం’, లేదా ‘వ’ గణం అని అంటారు.
ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.
ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.
అభ్యాసం :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
మూడక్షరాల గణాలు
మూడక్షరాల గణములు మొత్తం ఎనిమిది (8).
అ) మూడక్షరాల గణములను గుర్తించే సులభ మార్గం :
య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణముపేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ, గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి.
ఉదా :
మీకు య గణము యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా వ్రాయండి.
ఆ) మూడక్షరాల గణముల నిర్ణయంలో మరో పద్ధతి :
అని వ్రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణము పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా :
1) య గణము = యమాతా = IUU = ఆది లఘువు
2) మ గణము మాతారా = UUU = సర్వ గురువు
3) త గణము తారాజ = UUI = అంత్య లఘువు
4) ర గణము = రాజభా = UIU = మధ్య లఘువు
5) జ గణము = జభాన = IUI = మధ్య గురువు
6) భ గణము = భానస = UII = ఆది గురువు
7) న గణము : నసల = III = సర్వ లఘువులు
8) లగము (లేక ‘వ’ గణము = I U = లఘువు, గురువు)
నాలుగు అక్షరాల గణాలు
2) ఇంద్ర గణాలు : ఇవి ఆఱు రకములు : నల, నగ, సల, భ, ర, త – అనేవి ఇంద్ర గణములు.
యతి – ప్రాసలు
I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి :
పద్యపాదములోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
2. ప్రాస :
పద్యపాదములోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
II. గమనిక : నియమము చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికి, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ సౌకర్యం కలుగుతుంది.
3. యతి మైత్రి :
పద్యపాదము యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యములో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరము మైత్రి కలిగి ఉండడాన్ని, యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.
1. ఉత్పలమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.
యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గాని ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతి మైత్రి’ లేదా యతి స్థానం అంటారు.
పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – న; జే – సి) యతి.
ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.
ఉత్పలమాల పద్యం లక్షణాలు :
- ఇది వృత్త పద్యం.
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
- ప్రాస నియమం ఉంటుంది.
- ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.
2. చంపకమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
చంపకమాల పద్య లక్షణాలు :
- ఇది వృత్త పద్యం.
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం (అ – య).
- ప్రాస నియమం ఉంటుంది.
- ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.
3. శార్దూలం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
శార్దూల పద్య లక్షణాలు :
- ఇది వృత్తపద్యం.
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం (ఆ – యం).
- ప్రాస నియమం ఉంటుంది.
- ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.
4. మత్తేభం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
మత్తేభ పద్య లక్షణాలు :
- ఇది వృత్త పద్యం.
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం (ప – పా).
- ప్రాస నియమం ఉంటుంది.
- ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.
5. ఛందస్సు – తేటగీతి
తేటగీతి పద్య లక్షణం :
- ఇది ‘ఉపజాతి’ పద్యం.
- ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
- నాలుగో గణం మొదటి అక్షరం యతి స్థానం.
- ప్రాస యతి చెల్లుతుంది.
- ప్రాస నియమం లేదు.
ఉదా :
పై పద్యంలో 1 సూర్యగణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం. ఇక్కడ ‘ప్రాసయతి’ వాడబడింది.
AP Board Textbook Solutions PDF for Class 9th Telugu
- AP Board Class 9 Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 1 శాంతికాంక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 2 స్వభాష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 3 శివతాండవం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 4 ప్రేరణ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 5 పద్యరత్నాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 6 ప్రబోధం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 7 ఆడినమాట Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 8 చూడడమనే కళ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 10 బతుకు పుస్తకం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 11 ధర్మదీక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu లేఖలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu వ్యాసాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Grammar Chandassu ఛందస్సు Textbook Solutions PDF
0 Comments:
Post a Comment