![]() |
AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Book Answers |
Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbooks. These Andhra Pradesh State Board Class 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 9th |
Subject | Maths |
Chapters | Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Answers.
- Look for your Andhra Pradesh Board STD 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbook Solutions for PDF Free.
AP Board Class 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 9th Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:9th Class Telugu ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి Textbook Questions and Answers
కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
గిడుగు వెంకట రామమూర్తి గారి జీవిత విశేషాలను సంక్షిప్తంగా రాయండి.
(లేదా)
వ్యావహారిక భాష కోసం ఉద్యమం చేపట్టి సవరభాషకు ఎంతో సేవ చేసిన గిడుగు రామమూర్తి పంతులు గారి జీవిత విశేషాలను వివరించండి.
జవాబు:
గిడుగు వెంకట రామమూర్తిగారు వీర్రాజు, వెంకమాంబ పుణ్య దంపతులకు 29-8-1863న జన్మించారు. విజయ నగరం జిల్లా పర్వతాలపేటలో వీరి పాఠశాల విద్య సాగింది. వారణాసి గున్నయ్యశాస్త్రిగారు ఈయనకు రాయడం, చదవడం నేర్పారు. తండ్రిగారు భారత, భాగవత పద్యాలు నేర్పారు.
ఈయన మెట్రిక్ లో పాసై, పర్లాకిమిడిరాజా వారి మిడిల్ స్కూలు టీచరుగా చేరారు. ఎఫ్.ఎ అయ్యాక హైస్కూలు టీచరు అయ్యారు. రామమూర్తి గారికి 16వ ఏట అన్నపూర్ణతో వివాహం అయ్యింది. రామమూర్తి గార్కి 1885లో పుత్రుడు సీతాపతిగారు పుట్టారు.
ఈయన ముఖ్య స్నేహితుడు గురజాడ వెంకట అప్పారావుగారు. ఈయన 1892లో సవర భాష నేర్చుకున్నారు. సవరలకు బడులు పెట్టించడానికి కృషి చేశారు.
తెలుగు – సవర నిఘంటువులు రచించారు. సొంత ధనంతో సవరల కోసం బడి పెట్టించి, 30 సంవత్సరాలు కృషి చేశారు. వీరిని 1913లో ‘రావుసాహెబ్’ బిరుదుతోను 1934లో కైజర్-ఇ-హిందీ అనే సువర్ణ పతాకంతోను బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది.
విద్యార్థులకు శిష్ట వ్యావహారికమే బోధనా భాషగా ఉండాలని ఈయన జయప్రదమైన ఉద్యమం చేశారు. 1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించారు. 1940 జనవరి 22వ తేదీన మరణించారు.
ప్రశ్న 2.
రామమూర్తి పంతులు గారి రచనలను గురించి తెల్పండి.
జవాబు:
రామమూర్తి పంతులుగారు సవరభాషపై కృషి చేసి, “తెలుగు – సవర నిఘంటువు”ను రచించారు. సవరపాటలూ, సవర కథలూ కొన్ని సవర భాషలోనే రాసి పెట్టుకున్నారు. సవర భాషకు వ్యాకరణం రచించడానికి కృషి చేశారు. ఈ పనిలో ఈయనకు “మామిడల్లం కుమారస్వామి పంతులుగారు” సహకరించారు.
రామమూర్తిగారు పర్లాకిమిడిలో తెలుగు పత్రికను ఒక సంవత్సరం పాటు నిర్వహించారు. 1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించారు. ఇది అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం అని (ప్రొఫెసర్ డేవిడ్ సొంపే తెలిపారు. 1913లో ఈయన ప్రకటించిన A Memorandum on Modern Telugu అనే ఆంగ్ల రచన ద్వారా, నాటి భాషా స్థితి పైనా, విద్యా విధానం పైనా రామమూర్తి గారి దృష్టి మనకు స్పష్టమౌతుంది.
పాఠశాల పుస్తకాల్లోనే కాకుండా ప్రభుత్వం ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా వాడుక భాషే వాడాలని రామమూర్తి గారు సూచించారు. రామమూర్తిగారు గొప్ప గ్రంథ పరిష్కర్త. పత్రికా రచయిత. విద్యావేత్త.
ప్రశ్న 3.
రామమూర్తిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి’ అనే వాక్యాన్ని మీరెలా సమర్థిస్తారు?
(లేదా)
‘గిడుగు రామ్మూర్తి పంతులుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి’ సమర్థించండి.
జవాబు:
గిడుగు రామమూర్తిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరిది మహోన్నత వ్యక్తిత్వం. ఈయనకు సాటిలేని మానవతా దృష్టి ఉంది. ఈయన చరిత్ర భావితరాలకు మార్గదర్శనం చేస్తుంది. ఈయన. గొప్ప అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త. ఈయన డేనియల్ జోన్స్ వంటి బ్రిటిష్ ధ్వని శాస్త్రవేత్తలతో చర్చలూ, ఒట్టోజెన్ పర్సన్ వంటి వ్యాసకర్తలతో ఉత్తర ప్రత్యుత్తరాలూ జరిపిన గొప్ప అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త.
ఈయన గొప్ప కావ్య భాషా పరిశోధకుడు. శాస్త్ర పరిశోధకుడు. ఈయన థర్స్టన్ రచించిన సంపుటాలలో సవర జాతికి చెందిన అంశాలపై పరిశోధక రచనలు చేసిన శాస్త్రవేత్త.
1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించాడు. ఇది అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం అని, ప్రొఫెసర్ డేవిడ్ స్టాంపే తెలిపాడు. సవర భాష నేర్చుకొని, వారికి తన సొంత ధనంతో బడిపెట్టి 30 సంవత్సరాల పాటు నిర్వహించారు.
1913లో ఈయన ప్రకటించిన A Memorandum on Modern Telugu అనే ఆంగ్ల రచన ద్వారా నాటి భాషా స్థితి పైన, విద్యా విధానంపైన వీరి దృక్పథం వెల్లడవుతుంది. పాఠశాల పుస్తకాల్లోనే కాకుండా, ప్రభుత్వం ప్రజలతో జరిపే • ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా వాడుక భాషే వాడాలని ఈయన సూచించారు.
వ్యావహారిక భాషోద్యమాన్ని విజయవంతంగా నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రామమూర్తిగారు.
ప్రశ్న 4.
వ్యావహారిక భాషావాదం వల్ల విద్యార్థులకు మేలే జరుగుతుందని మీరనుకుంటున్నారా? కారణాలు రాయండి.
జవాబు:
వ్యావహారిక భాషావాదం వల్ల విద్యార్థులకు మంచి మేలు జరిగింది. వాళ్ళు తాము మాట్లాడే భాషలోనే జవాబులు రాయగలుగుతున్నారు. గ్రాంథిక భాష అయితే అరసున్నాలు, శకట రేఫములు రాయాలి. వ్యాకరణ యుక్తంగా రాయాలి. మాట్లాడే భాష ఒకటి. వాళ్ళు రాసే భాష ఒకటి కావడంతో వాళ్ళు చిక్కులు ఎదుర్కొనేవారు.
వ్యావహారిక భాష అయితే వాళ్ళు పేపర్లలో చదివే భాషలోనే జవాబులూ, వ్యాసాలు రాయవచ్చు. గ్రాంథిక భాష కృత్రిమ భాష. వ్యావహారిక భాష, వారు చిన్ననాటి నుండి, తల్లిదండ్రుల నుండి నేర్చుకొన్న భాష. ప్రక్కవారితో మాట్లాడే భాష. కాబట్టి విద్యార్థులకు సులభంగా ఉంటుంది.
ఈ వ్యావహారిక భాషావాదం వల్లనే 1969లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని స్థాపించింది. పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో ప్రచురిస్తున్నారు. పి. హెచ్.డి విద్యార్థులు సైతం తమ పరిశోధనా వ్యాసాలను, వ్యావహారికంలో రాయడానికి, మొదట్లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయము అంగీకరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం 1973 నుండి వ్యావహారికంలో పరిశోధక వ్యాసాలు రాయడానికి అనుమతిస్తోంది.
నేడు క్రమంగా అన్నిచోట్లా వ్యావహారిక భాష చెలామణీ అవుతోంది. అందువల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది.
ప్రశ్న 5.
గురజాడ అప్పారావు గారిని గురించి రాయండి.
జవాబు:
గురజాడ అప్పారావు గారు గిడుగు వెంకటరామమూర్తిగారూ మంచి మిత్రులు. వారిద్దరూ ఒకే ఏడాది ఒకే బడిలో చదువుకున్నారు.
శ్రీ గురజాడ అప్పారావు గారు మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆయన అప్పటికే కవిత్వం రాయడం ప్రారంభించారు. అప్పారావు గారి తొలికథ ‘దిద్దుబాటు’ సాటిలేని మేటి కథ. ఇది 1910లో “ఆంధ్రభారతి” మాసపత్రికలో తొలిసారిగా అచ్చయ్యింది. ఆ కథను చదివి రసికులు పరవశులయ్యారు.
గురజాడ రచనల్లో కన్యాశుల్కం, కొండుభట్టీయం, బిల్హణీయం, నాటకాలు, వారికి మంచి కీర్తిని తెచ్చిపెట్టాయి. అప్పారావు గారి మార్గం నవీనము. ఆయన ప్రతిభ సాటిలేనిది. ఆయన భాష సజీవమైనది. ఈయన భావాలు సంచలనం.
అందుకే మహాకవి శ్రీశ్రీ “ఆది కాలంలో తిక్కన, మధ్య కాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ, మహాకవులు” అని చెప్పారు. గురజాడ రాసిన గేయాలు సుమారు ఇరవై ఉంటాయి. ఆ గేయాలే గురజాడను మహాకవిని చేశాయి.
‘గురజాడ వారి “ముత్యాల సరాలు”, ప్రభావం, అన్గండర కవుల మీద బాగ్హా ప్రసరించింది.
9th Class Telugu ఉపవాచకం 4th Lesson గిడుగు వెంకట రామమూర్తి Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
అ) ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
ప్రశ్న 1.
అ) 1940 జనవరి 22వ తేదీన, గిడుగు రామమూర్తి పంతులుగారు కోట్లాది తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.
ఆ) గిడుగు రామమూర్తి పంతులుగారికి 1913లో బ్రిటిష్ ప్రభుత్వం రావుసాహెబ్ బిరుదును ఇచ్చింది.
ఇ) గిడుగువారికి 16వ యేట అన్నపూర్ణతో వివాహం జరిగింది.
ఈ) గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్యదంపతులకు రామమూర్తిగారు జన్మించారు.
జవాబు:
ఈ) గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్యదంపతులకు రామమూర్తిగారు జన్మించారు.
ఇ) గిడుగువారికి 16వ యేట అన్నపూర్ణతో వివాహం జరిగింది.
ఆ) గిడుగు రామమూర్తి పంతులుగారికి 1913లో బ్రిటిష్ ప్రభుత్వం రావుసాహెబ్ బిరుదును ఇచ్చింది.
అ) 1940 జనవరి 22వ తేదీన, గిడుగు రామమూర్తి పంతులుగారు కోట్లాది తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.
ప్రశ్న 2.
అ) 1934లో కైజర్ – ఇ – హింద్ సువర్ణ పతకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం, రామమూర్తిగారికి బహుమతిగా ఇచ్చింది.
ఆ) ఇందుకోసం 1892లో రామమూర్తిగారు సవరభాష నేర్చుకోడం ప్రారంభించారు.
ఇ) కొండ కోనల్లో సవర భాషా, సవర పాటలు నేర్చుకుందామని తిరగడంతో, రామమూర్తిగారికి మలేరియా జ్వరం వచ్చింది.
ఈ) సవర భాషపై కృషి చేసి, తెలుగు – సవర నిఘంటువును రచించారు.
జవాబు:
ఆ) ఇందుకోసం 1892లో రామమూర్తిగారు సవరభాష నేర్చుకోడం ప్రారంభించారు.
ఇ) కొండ కోనల్లో సవర భాషా, సవర పాటలు నేర్చుకుందామని తిరగడంతో, రామమూర్తిగారికి మలేరియా జ్వరం వచ్చింది.
ఈ) సవర భాషపై కృషి చేసి, తెలుగు – సవర నిఘంటువును రచించారు.
అ) 1934లో కైజర్ – ఇ – హింద్ సువర్ణ పతకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం, రామమూర్తిగారికి బహుమతిగా ఇచ్చింది.
ప్రశ్న 3.
అ) 1907 నుండి 1910 వరకు జరిగిన సమావేశాల్లో, పాఠశాలల్లో, బోధనా భాషగా శిష్ట వ్యావహారికమే ఉండాలని, రామమూర్తిగారు ప్రసంగించేవారు.
ఆ) 1969లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, పి.హెచ్.డి విద్యార్థులు వ్యావహారికంలో తమ పరిశోధనా వ్యాసాలు రాయడానికి ఆమోదించాయి.
ఇ) 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ కూడా ఆధునిక వ్యావహారికమే, బోధనా భాషగా ఉండాలని తీర్మానించింది.
ఈ) విశ్వవిద్యాలయము వాడుక భాషను ఆమోదించడం ఆలస్యమైనా, పత్రికలు, రేడియోలు, సినిమాలు వ్యావహారిక భాషను ముందే ఆమోదించాయి.
జవాబు:
అ) 1907 నుండి 1910 వరకు జరిగిన సమావేశాల్లో, పాఠశాలల్లో, బోధనా భాషగా శిష్ట వ్యావహారికమే ఉండాలని, రామమూర్తిగారు ప్రసంగించేవారు.
ఇ) 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ కూడా ఆధునిక వ్యావహారికమే, బోధనా భాషగా ఉండాలని తీర్మానించింది.
ఈ) విశ్వవిద్యాలయము వాడుక భాషను ఆమోదించడం ఆలస్యమైనా, పత్రికలు, రేడియోలు, సినిమాలు వ్యావహారిక భాషను ముందే ఆమోదించాయి.
ఆ) 1969లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, పి. హెచ్.డి విద్యార్థు వ్యావహారికంలో తమ పరిశోధనా వ్యాసాలు రాయడానికి ఆమోదించాయి.
ప్రశ్న 4.
అ) 1940 జనవరి 22వ తేదీన రామమూర్తి పంతులుగారు, తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.
ఆ) రామమూర్తి గారి తండ్రి వీర్రాజుగారు, 1830 లోనే ఉద్యోగం కోసం విజయనగరం వలస వెళ్ళారు.
ఇ) రామమూర్తి పంతులు గారికి పుత్రుడు జన్మించాడు. ఆయన పేరు వెంకట సీతాపతి.
ఈ) కందికొండ రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణతో రామమూర్తిగారికి వివాహం జరిగింది.
జవాబు:
ఆ) రామమూర్తి గారి తండ్రి వీర్రాజు గారు, 1830 లోనే ఉద్యోగం కోసం విజయనగరం వలస వెళ్ళారు.
ఈ) కందికొండ రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణతో రామమూర్తిగారికి వివాహం జరిగింది.
ఇ) రామమూర్తి పంతులు గారికి పుత్రుడు జన్మించాడు. ఆయన పేరు వెంకట సీతాపతి.
అ) 1940 జనవరి 22వ తేదీన రామమూర్తి పంతులుగారు, తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు.
ప్రశ్న 5.
అ) 1940 జనవరి 22వ తేదిన శ్రీ గిడుగు రామమూర్తిగారు పరమపదించారు.
ఆ) శ్రీ గిడుగు రామమూర్తిగారు 1936 వరకు పర్లాకిమిడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
ఇ) శ్రీ వీర్రాజు వెంకమాంబ పుణ్య దంపతులకు ది. 09.08.1863న రామమూర్తిగారు జన్మించారు.
ఈ) 1879లో శ్రీరామమూర్తి గారికి 16వ ఏట వివాహం జరిగింది.
జవాబు:
ఇ) శ్రీ వీర్రాజు వెంకమాంబ పుణ్య దంపతులకు ది. 09.08. 1863న రామమూర్తిగారు జన్మించారు.
ఈ)1879లో శ్రీరామమూర్తి గారికి 16వ ఏట వివాహం జరిగింది.
ఆ) శ్రీ గిడుగు రామమూర్తిగారు 1936 వరకు పర్లాకిమిడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
అ) 1940 జనవరి 22వ తేదిన శ్రీ గిడుగు రామమూర్తిగారు పరమపదించారు.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
సవరల అభివృద్ధికై గిడుగువారి కృషిని తెల్పండి.
జవాబు:
ఆదివాసీల అక్షర శిల్పి గిడుగు రామమూర్తి. ఆదిమ సవర జాతి గిరిజనుల భాషకు లిపిని, నిఘంటువును రూపొందించిన మహనీయుడు గిడుగు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో అనేకమంది సవరలు నివసిస్తున్నారు. వారు ఆదిమ నివాసులు. అక్షర జ్ఞానం, బాహ్య సమాజం అంటే తెలియని అమాయకులు. గతంలో ఎంతో ఉన్నతంగా విలువలతో జీవించిన సవరలు ఆధునిక సమాజంలో వెనుకబడి ఉండటం రామమూర్తిని బాధించింది. వీరికి చదువు చెప్పి విజ్ఞానవంతులను చేయగలిగితే వారి బతుకులు బాగుపడతాయని గిడుగు సవర భాషను నేర్చుకున్నారు. వాచకాలు, కథలు, పాటలు పుస్తకాలు, తెలుగు – సవర, సవర – తెలుగు నిఘంటువులను తయారు చేసారు. 1930లో సవరభాషలో “ఎ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్” అనే వర్ణనాత్మక వ్యాకరణాన్ని రాశారు.
ప్రశ్న 2.
వ్యావహారిక భాషోద్యమం – ‘గిడుగు’ అడుగు రాయండి.
జవాబు:
‘గిడుగు పిడుగు’. తెలుగు భాషాబోధనలో, వ్యాసాలూ, వార్తల రచనల్లో కథా కథనంలో గ్రాంథికం గాక, వాడుకలో ఉన్న పదాలతో ఎలా సామాన్యంగా మాట్లాడతామో అలా తెలుగు వాక్యాలను వ్రాయాలని ప్రతిపాదించి, ప్రయోగించి, ఉద్యమించి వాడుక తెలుగుభాషకు మాన్యతను తెచ్చిన ధీరుడు, పండితుడు కీ.శే. గిడుగు రామమూర్తి పంతులుగారు. వాడుక భాషను వ్యతిరేకించిన పండితుల రచనలలోని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను ఎత్తి చూపుతూ 1911-12 మధ్య “ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం” అనే గ్రంథం రాసారు.
1919లో గిడుగు ‘తెలుగు’ మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. వీరేశలింగం అధ్యక్షులుగా గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం” స్థాపించారు. వ్యావహారిక భాషను ప్రతిష్ఠించడంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం వెనుకంజ వేసినా పత్రికలు మాత్రం గిడుగు వారి వాదానికి పూర్తి సహకారం ఇచ్చాయి. గిడుగు వారిచేత ఉత్తేజితులైన పలువురు రచయితలు వాడుక భాషలో గ్రంథాలు రచించి వాడుక భాష గొప్పదనాన్ని ఋజువు చేశారు. “గ్రాంథిక భాషను ఎవ్వరూ చదువకూడదా ? అని ప్రశ్న వేస్తే, “నేను గ్రాంథిక భాషకు వ్యతిరేకిని కాదు. ప్రజలకు ఉపయోగపడే గ్రంథాలను కృతక భాషలో రచించి భేషజాన్ని ప్రదర్శించవద్దంటాను” అని గిడుగువారు అంటారు. 1911లో రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన ఈ ఉద్యమం 1973 నాటికి గాని విజయవంతం కాలేదు.
AP Board Textbook Solutions PDF for Class 9th Telugu
- AP Board Class 9 Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 1 శాంతికాంక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 2 స్వభాష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 3 శివతాండవం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 4 ప్రేరణ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 5 పద్యరత్నాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 6 ప్రబోధం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 7 ఆడినమాట Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 8 చూడడమనే కళ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 10 బతుకు పుస్తకం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 11 ధర్మదీక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu లేఖలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu వ్యాసాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Grammar Chandassu ఛందస్సు Textbook Solutions PDF
0 Comments:
Post a Comment