![]() |
AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Book Answers |
Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbooks. These Andhra Pradesh State Board Class 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 9th |
Subject | Maths |
Chapters | Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Answers.
- Look for your Andhra Pradesh Board STD 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Solutions for PDF Free.
AP Board Class 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 9th Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:9th Class Telugu ఉపవాచకం 6th Lesson ధృవతారలు Textbook Questions and Answers
కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
వైద్యరంగంలో డా॥ నోరి దత్తాత్రేయుడు గారు చేసిన కృషిని గురించి రాయండి.
జవాబు:
ప్రపంచస్థాయి వైద్యునిగా గుర్తింపు పొందిన డా|| నోరి దత్తాత్రేయుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. సరైన వైద్యం లేకపోవడం వలనే తండ్రిని కోల్పోయామని తల్లి ద్వారా తెలుసుకొన్న నోరి ప్రభావితుడై వైద్యుడు అవ్వాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రేడియం ఇనిస్టిట్యూట్ అండ్ కాన్సర్ హాస్పటల్ లో రెసిడెంట్ వైద్యునిగా సేవలందించారు. వ్యాధి సరైన సమయంలో గుర్తించలేకపోవడం, వైద్యం చాలా భారమైనదిగా ఉండడం, మందులు అందుబాటులో లేకపోవడం మొదలైన కారణాల వల్ల ఎందరో వ్యాధిగ్రస్తులు మరణం తప్ప మరొక శరణ్యం లేదని కుమిలిపోవడం ఆయనను ఎంతగానో కలచివేసింది. క్యాన్సర్ పై పరిశోధనలకు కంకణం కట్టుకున్నారు. 1977వ సం||లో కాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికా వెళ్ళారు.
పరిశోధనల్లో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. ఎక్కడా నిరాశ చెందలేదు. తాననుకున్నది సాధించే వరకు నిరంతరం కృషి చేస్తూ విజయాన్ని చేజిక్కించుకున్నాడు. ముఖ్యంగా మహిళలకు వచ్చే కాన్సర్ వ్యాధుల్ని నివారించటం కొరకు విశేషమైన కృషి చేసాడు. 1979 నుండి బ్రాకి థెరపి అనే వైద్య ప్రక్రియలో పరిశోధనలు జరిపి అత్యంత నైపుణ్యం గల వైద్యుడిగా అనేక వేల మంది కాన్సర్ రోగులకు నయం చేశారు. వైద్యవృత్తిలో అడుగుపెట్టి భయంకరమైన క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తూ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రపంచ ప్రసిద్ధ రేడియో అంకాలజిస్ట్ డా|| నోరి దత్తాత్రేయుడు గారు “వైద్యోనారాయణా హరిః” అన్న మాటకు నిలువుటద్దం. నిజమైన ధృవతార.
ప్రశ్న 2.
డా|| నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవలందించడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
వైద్యవృత్తిలో కాలుమోపి భయంకరమైన క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తూ వ్యాధిగ్రస్తుల జీవితాలలో వెలుగులు నింపిన నోరి దత్తాత్రేయుడు నిజమైన ధృవతార. చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని నిర్ణయించుకొని అనతి కాలంలోనే మంచి విద్యార్థిగా పేరుపొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.డి.లో ఉత్తీర్ణత పొందాడు. కాన్సర్ వ్యాధిగ్రస్తుల బాధలను చూసి చలించి 1977లో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికా వెళ్ళారు. బ్రాక్ థెరపి వైద్య ప్రక్రియలో పరిశోధనలు చేసి వేలమంది క్యాన్సర్ రోగులకు నయం చేసాడు.
అమెరికాలోని మెమోరియల్ స్టోన్ కేటరింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యన్.టి. రామారావు గారి సతీమణి బసవతారకం గారికి క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేశారు. ఆ సందర్భంలో యన్.టి. రామారావుగారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించమని డా|| నోరికి ఒక విజ్ఞాపన చేశారు. అప్పుడు డా|| నోరి తనకూ సొంతగడ్డపై కాన్సర్ హాస్పిటల్ నిర్మించి సేవలందించాలనే తలంపు ఉన్నట్లు మనసులో మాట వెల్లడించారు. వెంటనే ముఖ్యమంత్రి ఏడెకరాల భూమిని క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం కోసం కేటాయించారు. ఈ విధంగా యన్.టి.రామారావుగారి కోరిక మేరకు, తన నేలతల్లిపై గల మమకారం వల్ల డా|| నోరి దత్తాత్రేయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు.
ప్రశ్న 3.
సర్దేశాయి తిరుమలరావు జీవితం సైన్స్ కూ, సాహిత్యానికీ మధ్య గల సంబంధాన్ని ఎలా తెలియజేస్తుందో రాయండి.
జవాబు:
సైను, సాహిత్యాన్ని సమపాళ్ళలో రంగరించి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న అసలు సిసలు తెలుగు శాస్త్రవేత్త, భాషావేత్త సర్దేశాయి తిరుమలరావుగారు. సైన్స్ కూ, సాహిత్యానికి అగాథం పూడ్చాలని ఆయన పదేపదే చెప్పేవారు. ఆయన తన రచనలలో సైనూ, సాహిత్యానికి ఉండే తేడాను, అనుబంధాన్ని బాగా విశ్లేషించేవారు. ఇవి రెండూ కూడా సమాజ హితాన్ని కోరేవిగా ఉండాలని ఆయన భావించేవారు.
మనిషిని స్వావలంబునిగా, సమాజ శ్రేయస్సు కోరి పనిచేసే వ్యక్తిగా ప్రేరేపించగలిగే ఉదాత్త భావమే కవిత్వమని ఆయన ఉద్దేశ్యం. ఆసక్తులను శక్తులుగా మార్చగలిగేదే కవిత్వం అని ఆయన చెప్పేవారు. కవిత్వం ఒక స్ప్రింగ్ బోర్డు వంటిది. దానిమీద నిలబడి మనిషి ప్రగతి పథానికి ఎగురగల్గి ఉండాలి అని ఆయన చెప్పేవారు.
కవిత్వాన్ని రసాయన ప్రక్రియ లాగా ఎలా విశ్లేషించారో చూడండి – “పెద్దబండలో అనవసరమైన రాతి పదార్థాన్ని చెక్కి పారవేసి శిల్పి చక్కని విగ్రహాన్ని తయారుచేస్తాడు. రసాయన శాస్త్రవేత్త వంటి కవి వస్తు భావాలకు ప్రతిభా పాండిత్యాలని, రసాయన ప్రేరకాలని చేర్చి, మేధస్సు’ అనే క్రియా కలశంలో చర్య జరిపి, ఫలితాలను విచక్షణ అనే జల్లెడలో వడబోసి, వచ్చిన కవితా సారాన్ని మనకు అందిస్తాడు” అని చెప్పేవారు. ఋషితుల్యుడైన ఆయన ఆలోచనలు ఏక కాలంలో సంక్లిష్టములు, సరళములు.
9th Class Telugu ఉపవాచకం 6th Lesson ధృవతారలు Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
ప్రశ్న 1.
అ) తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేసి ఆ సంస్థ డైరెక్టరుగా 1989లో పదవీ విరమణ చేశారు.
ఆ) అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఎస్సీ . చేశారు.
ఇ) డా|| సర్దేశాయి తిరుమలరావు 1928లో కర్నూలు జిల్లా జోరాపురంలో జన్మించారు.
ఈ) రాజస్థాన్ లోని బిట్స్ పిలానిలో ఎం.ఎస్సీ. రసాయన శాస్త్రం చదివారు.
జవాబు:
ఇ) డా|| సర్దేశాయి తిరుమలరావు 1928లో కర్నూలు జిల్లా జోరాపురంలో జన్మించారు.
ఆ) అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి. ఎస్సీ, చేశారు.
ఈ) రాజస్థాన్ లోని బిట్స్ పిలానిలో ఎం. ఎస్సీ, రసాయన శాస్త్రం చదివారు.
అ) తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేసి ఆ సంస్థ డైరెక్టరుగా 1989లో పదవీ విరమణ చేశారు.
ప్రశ్న 2.
అ) పిలానీలో చదివేటప్పుడు గాంధీజీకి నిరాహార దీక్ష సరిపోయినపుడు, పొట్టి శ్రీరాములుకు ఎందుకు సరిపోదని హిందూస్థాన్ టైమ్సుకు లేఖ రాశారు.
ఆ) సర్దేశాయి తిరుమల రావుగారు 1928 నవంబరు 28న ఛత్రపతి శివాజీ పుట్టిన రోజునాడు జన్మించారు.
ఇ) అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు.
ఈ) అనంతపురం ఓ.టీ.ఆర్.ఐ (తైల సాంకేతిక పరిశోధనా సంస్థ)లో చేరి, ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
జవాబు:
ఆ) సర్దేశాయి తిరుమల రావుగారు 1928 నవంబరు 28న ఛత్రపతి శివాజీ పుట్టిన రోజునాడు జన్మించారు.
అ) పిలానీలో చదివేటప్పుడు గాంధీజీకి నిరాహార దీక్ష సరిపోయినపుడు, పొట్టి శ్రీరాములుకు ఎందుకు సరిపోదని హిందూస్థాన్ టైమ్సుకు లేఖ రాశారు.
ఇ) అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు.
ఈ) అనంతపురం ఓ.టీ.ఆర్.ఐ (తైల సాంకేతిక పరిశోధనా సంస్థ)లో చేరి, ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
ప్రశ్న 3.
అ) సర్దేశాయి తిరుమల రావుగారు 1994 మే 10వ తేదీన గతించారు.
ఆ) ఆదోని, అనంతపురంలలో తిరుమలరావుగారి హైస్కూలు చదువు సాగింది.
ఇ) 1991లో జే.జే కాణీ పురస్కారం అందుకున్నారు.
ఈ) అనంతపురంలోని తైల పరిశోధనా సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
జవాబు:
ఆ) ఆదోని, అనంతపురంలలో తిరుమలరావుగారి హైస్కూలు చదువు సాగింది.
ఈ) అనంతపురంలోని తైల పరిశోధనా సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
ఇ) 1991లో జే.జే కాణ్ పురస్కారం అందుకున్నారు.
అ) సర్దేశాయి తిరుమల రావుగారు 1994 మే 10వ తేదీన గతించారు.
ప్రశ్న 4.
అ) 1977వ సంవత్సరంలో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికాకు వెళ్లారు.
ఆ) భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది.
ఇ) కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు.
ఈ) కర్నూలు వైద్యకళాశాలలో ఎమ్.బి.బి.యస్ లో చేరారు.
జవాబు:
ఇ) కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు.
ఈ) కర్నూలు వైద్యకళాశాలలో ఎమ్. బి. బి.యస్ లో చేరారు.
అ) 1977వ సంవత్సరంలో క్యాన్సర్ పై పరిశోధన చేయడానికి అమెరికాకు వెళ్లారు.
ఆ) భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
డా॥ నోరి చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని ఎందుకు నిర్ణయించుకొన్నారు?
జవాబు:
కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో నోరి సత్యనారాయణ, కనకదుర్గ దంపతుల పదవ సంతానం దత్తాత్రేయుడు. ఈయన ఐదవ యేటనే తండ్రి మరణించాడు. సరైన వైద్య సదుపాయం లేకపోవడం వలన, వైద్యం ఖరీదైనది కావడం వల్లనే తండ్రి మరణించాడని ఇలాగ ఎందరో జీవితాలను కోల్పోతున్నారని తల్లి తరచుగా చెబుతుండేది. ఈ మాటలు దత్తాత్రేయ మీద ఎంతగానో ప్రభావితం చూపాయి. అందుచేత చిన్నతనంలోనే వైద్యుడవ్వాలని నిర్ణయించుకున్నారు.
ప్రశ్న 2.
డా॥ నోరి విద్యాభ్యాసం గూర్చి రాయండి.
జవాబు:
1947 అక్టోబరు 21న కృష్ణాజిల్లా ‘మంటాడ’ గ్రామంలో దత్తాత్రేయుడు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ‘ తల్లి పెంపకంలో పెరిగాడు. బందరులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేశాడు. తర్వాత పి.యు.సి., బి.యస్సీ డిగ్రీని బందరు జాతీయ కళాశాలలో చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. వీరి పెద్దమ్మ జొన్నలగడ్డ సుందరమ్మ అతడి చదువుకు కావలసిన సహాయసహకారాలందించింది. కర్నూలు వైద్యకళాశాలలో యం.బి.బి.యస్ చదివి ప్రథముడిగా (1971లో) ఉత్తీర్ణులయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి యమ్.డి.లో ఉత్తీర్ణత సాధించారు.
ప్రశ్న 3.
డా॥ నోరి అందుకున్న అవార్డులు, పొందిన గౌరవాలు తెల్పండి.
జవాబు:
విద్యార్థి దశలో ప్రతి తరగతిలోనూ ప్రథముడిగా నిలిచి ఉపకార వేతనాలు, బహుమతులు అందుకున్న డా|| నోరి వైద్యునిగా చేస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొందారు. 1984లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ ఫెలోషిప్ ఫ్యాక్టరీ అవార్డు ఇచ్చారు. 1990లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. 1994లో అలుమిని సొసైటీ, మెమోరియల్ ప్లాన్, కేటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విఫ్ట్ అలుమినస్ అవార్డు అందుకున్నారు. 1995లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2003లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నాడు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ “ట్రిబ్యూట్ టు లైఫ్” గౌరవాన్ని బహుకరించింది. భారత ప్రభుత్వం 2015 సం||లో డా|| నోరిని “పద్మశ్రీ ” బిరుదుతో సత్కరించింది.
ప్రశ్న 4.
డా॥ నోరి ప్రస్తుతం నిర్వర్తిస్తున్న పదవులేవి?
జవాబు:
తల్లి మాటలతో ప్రభావితుడై వైద్యవృత్తిని ఎంచుకొని, దానిలో తనకంటూ ఒక స్థానం పొందారు డా|| నోరి దత్తాత్రేయుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్య సలహామండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ లోని “బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్” నిర్వహణ బాధ్యతల్ని చేపట్టి వైద్య సేవలందిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.
సైనూ సాహిత్యానికి వారధి సర్దేశాయి తిరుమలరావు
ప్రశ్న 1.
……… నేను ఇప్పటికీ స్వచ్చమైన పరిశోధకుడినే !” అని సర్దేశాయి గారి మాటల్లో ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
1991 సెప్టెంబరులో జే.జే. కాణ్ పురస్కారం అందుకున్న సందర్భంలో చేసిన స్మారక ప్రసంగంలో అన్న మాటలివి. నేను ఇప్పటికీ స్వచ్ఛమైన పరిశోధకుడినే ! కలుషితం కాలేదు. పరిశోధన, పరిశోధకుడు అంటే గిరి గీసుకొని దానిలోనే తిరుగుతూ, వెతుకుతూ ఉండడం కాదు. సహజమైన ఆసక్తి, ఇష్టం చేసే ప్రతి పనీ ఒక పరిశోధనే. అలాంటివాడు పరిశోధకుడే అని వారి భావన అయి ఉండవచ్చు.
ప్రశ్న 2.
సర్దేశాయిగారి వ్యక్తిత్వం ఎటువంటిది?
జవాబు:
“ఎవరూ రాకపోయినా, ఒక్కడవే, ఒక్కడవే, పదవోయి” అనే ఠాగూర్ గీతం స్ఫూర్తితో చివరికంటా ఒంటరి పోరాటం చేసిన మహోన్నతుడు సర్దేశాయి. మొహమాటం, కపటం, ఆయనకు తెలియవు. ముక్కుసూటి మనిషి. అందువల్లనే ఆయన పరిశోధన తీక్షణంగా ఉంటుంది. విమర్శ తీవ్రంగా ఉంటుంది. ఎలాంటి మొహమాటాలు లేవు కనుకనే ఆయన మాట కటువుగా ఉంటుంది. సంగీతం అంటే మక్కువ. వారి వద్ద అపురూపమైన గ్రంథాలయం ఉంది. వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చారు. సంస్థలో ఎంత చిన్నస్థానంలో పనిచేసే వ్యక్తినైనా ఉత్తేజితుని చేసేవారు. విద్యావేత్తలతో, వ్యవసాయదారులతో, పారిశ్రామిక వేత్తలతోను ఒకే విధమైన మాట తీరుతో మాట్లాడేవారు.
ప్రశ్న 3.
మామిడి టెంకలపై సర్దేశాయి పరిశోధనను గూర్చి రాయండి.
జవాబు:
ఒకసారి అనంతపురంలో రోడ్డు మీద నడచి వెళుతూ, తిని పడవేసిన మామిడి టెంకలు విపరీతంగా ఉండటం గమనించారు సర్దేశాయి. వీటిమీద ఆలోచన మొదలైంది. ప్రపంచంలో తొలిసారిగా వీటిమీద పరిశోధనలు చేసారు. గొప్ప ఫలితాలు సాధించారు. ఇపుడు మామిడిటెంక నుండి తీసిన పదార్థం నుండి తయారుచేసిన నూనెను పాశ్చాత్య దేశాల్లో మేలురకం చాక్ లెట్లలో వాడతారు. ఫలితంగా ఇపుడు మనకు విదేశీమారక ద్రవ్యం లభిస్తోంది. అదీ సర్దేశాయి పరిశోధనాంశాన్ని ఎంచుకునే విధానం.
ప్రశ్న 3.
సర్దేశాయి విద్యాభ్యాసం, ఉద్యోగం గూర్చి రాయండి.
జవాబు:
1928 నవంబరు 28 కర్నూలు జిల్లా, ఆలూరు తాలుకా, జోరాపురంలో జన్మించారు సర్దేశాయి తిరుమలరావు. వీరి మాతృభాష కన్నడం. అయినా సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి దిట్ట. అనంతపురంలో హైస్కూల్ చదువు, బి.ఎస్సీ. పూర్తి చేశారు. రాజస్థాన్ లోని బిట్స్ – పిలానిలో ఎం.ఎస్సీ. రసాయన శాస్త్రం చదివారు. తర్వాత అనంతపురంలో ఒక సంవత్సరం ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1954లో అనంతపురంలోని తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో రీసెర్చి కెమిస్టుగా చేరి, వివిధ హోదాల్లో పనిచేశారు. 1989లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు.
ప్రశ్న 5.
తిరుమలరావు పరిశోధనాంశాలు ఏవి?
జవాబు:
డా|| తిరుమలరావు గారి పరిశోధనాంశాలు పరిశీలిస్తే ‘కాదేది పరిశోధనకు అనర్హం’ అని వ్యాఖ్యానించాలనిపిస్తుంది. బియ్యపు పొట్టు, కొబ్బరి, పట్టు పురుగు గుడ్డు, వాడిన కాఫీ పొడి, పత్తి విత్తనాలు, ఆముదాలు, వేరుశనగ గింజలు, పొగాకు విత్తనాలు, వేపగింజలు, మిరప విత్తనాలు, సీతాఫలం గింజలు, సూర్యకాంతి విత్తనాలు, జీడిమామిడి, మిల్క్ డైరీ అవక్షేపం, అరటితొక్కలు, నారింజ తొక్కలు, టమోట విత్తనాలు, దవనం, పుదీనా, మరువం, రోసాగడ్డి – ఇలా ఆయన దృష్టి పడని అంశం లేదు అనిపిస్తుంది. ఇంకా నువ్వులు, మొక్కజొన్నలు, కుసుములు, ఇప్పపువ్వు ఇలా ఎన్నింటి నుండో నూనె తీయవచ్చునని పరిశోధించారు.
ప్రశ్న 6.
డా|| తిరుమలరావు గారిలోని సాహిత్య కోణాన్ని గమనించండి.
జవాబు:
కావ్యాలలో ‘శివభారతం’, నాటకాలలో ‘కన్యాశుల్కం’, ‘నవలల్లో’, ‘మాలపల్లి’ చాలా గొప్పవని డా|| తిరుమలరావు తరచు చెప్పేవారు. ‘సాహిత్య తత్వం – శివభారత – దర్శనం’, ‘కన్యాశుల్కం – నాటక కళ’ అనే పేరుతో విమర్శనాత్మక గ్రంథాలు రాసారు. మేఘసందేశంలోని మేఘుని మార్గము, భౌగోళిక వాతావరణ విశేషాలు, అలెగ్జాండర్ పోపు – వేమన, ప్రపంచాన్ని మార్చిన శాస్త్రీయ సంఘటనలు మొదలైన గ్రంథాలు రచించారు. అలాగే సాహిత్య విమర్శలు, పరిశోధనా పత్రాలు అనేకం వీరి అమృత లేఖిని నుండి జాలువారాయి.
AP Board Textbook Solutions PDF for Class 9th Telugu
- AP Board Class 9 Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 1 శాంతికాంక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 2 స్వభాష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 3 శివతాండవం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 4 ప్రేరణ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 5 పద్యరత్నాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 6 ప్రబోధం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 7 ఆడినమాట Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 8 చూడడమనే కళ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 10 బతుకు పుస్తకం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 11 ధర్మదీక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu లేఖలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu వ్యాసాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Grammar Chandassu ఛందస్సు Textbook Solutions PDF
0 Comments:
Post a Comment