![]() |
AP Board Class 7 Telugu Chapter 8 నిజం-నిజం Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 7th Telugu Chapter 8 నిజం-నిజం Book Answers |
Andhra Pradesh Board Class 7th Telugu Chapter 8 నిజం-నిజం Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 7th Telugu Chapter 8 నిజం-నిజం Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 7th Telugu Chapter 8 నిజం-నిజం Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 7th Telugu Chapter 8 నిజం-నిజం solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 7th Telugu Chapter 8 నిజం-నిజం Textbooks. These Andhra Pradesh State Board Class 7th Telugu Chapter 8 నిజం-నిజం Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 7th Telugu Chapter 8 నిజం-నిజం Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 7th |
Subject | Telugu |
Chapters | Telugu Chapter 8 నిజం-నిజం |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 7th Telugu Chapter 8 నిజం-నిజం Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 7th Telugu Chapter 8 నిజం-నిజం Answers.
- Look for your Andhra Pradesh Board STD 7th Telugu Chapter 8 నిజం-నిజం Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 7th Telugu Chapter 8 నిజం-నిజం Textbook Solutions for PDF Free.
AP Board Class 7th Telugu Chapter 8 నిజం-నిజం Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 7th Telugu Chapter 8 నిజం-నిజం Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:7th Class Telugu 8th Lesson నిజం-నిజం Textbook Questions and Answers
ఆలోచించండి – మాట్లాడండి
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
పై చిత్రంలో పిల్లవాడు ఏ పాత్ర ధరించాడు?
జవాబు:
పై చిత్రంలో పిల్లవాడు ‘భీముడు’ పాత్ర ధరించాడు.
ప్రశ్న 2.
ఏ సందర్భంలో పిల్లలు ఇలాంటి వేషాలు ధరిస్తారు? ఎందుకు?
జవాబు:
పాఠశాలలో వార్షికోత్సవం జరిగినప్పుడు పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తారు. తమలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించి, తోడిపిల్లలను సంతోషపెట్టడానికి పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తారు.
ప్రశ్న 3.
చిత్రంలో అమ్మాయి గదను గురించి ఏమనుకుంటోంది?
జవాబు:
చిత్రంలో అమ్మాయి, గదను చూసి తాను ఆడుకొనే బంతి అనుకుంటోంది.
ప్రశ్న 4.
వేషం ధరించిన పిల్లవాడు తన స్నేహితునితో ఏమి చెప్తున్నాడు?
జవాబు:
వేషం ధరించిన పిల్లవాడు, తాను భీముడి వేషం వేశానని, మిత్రుడికి చెప్తున్నాడు.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
శీను ఎలాంటివాడో మీ మాటల్లో చెప్పండి. రచయిత ఇంట్లో ఎందుకున్నాడు?
జవాబు:
శీను పన్నెండేండ్ల వయస్సు పిల్లవాడు. శీను రంగయ్యకు కుమారుడు. రంగయ్య రచయితకు మిత్రుడు. శీను మంచి చెడ్డలు చూసి, శీనును మంచిదారిలో పెడతాడని, రంగయ్య, శీనును రచయిత ఇంట్లో ఉంచి అక్కడ బడిలో చదివిస్తున్నాడు.
శీను ఈ మధ్య అబద్దాలు చెప్పడం మొదలు పెట్టాడు. దసరా సెలవులకు శీను ఇంటికి వెళ్ళి, బడి తెరిచాక నాల్గు రోజుల తర్వాత రచయిత ఇంటికి వచ్చాడు. బడికి ఆలస్యంగా వచ్చావేమిరా ? అని రచయిత అడిగితే, తన తండ్రి ఉండమన్నాడనీ, సెలవు చీటి తెచ్చాను కాని ఎక్కడో పారవేశాననీ, అబద్దాలు చెప్పాడు.
తిరిగి స్కూలుకు నాల్గురోజులు సెలవులు ఇచ్చారు. ఇంట్లో ఆవు ఈనుతుంది జున్ను తినాలని, శీను మళ్ళీ రచయితతో అబద్దాలు చెప్పాడు. తన తండ్రి రమ్మన్నాడని, తన ఊరిపిల్లవాడు సీతయ్యతో కలిసి తన ఊరు వెడతానని, రచయిత దగ్గర శీను అబద్దాలు చెప్పాడు.
అనుకోకుండా రచయితకు బజారులో శీను తండ్రి కనబడ్డాడు. శీనును తాను రమ్మనలేదని చెప్పాడు. విషయం తెలిసిన రచయిత, తెలివిగా శీనును డబాయించాడు. శీను తండ్రికి లేఖరాసిస్తానని దానికి జవాబు రాయించుకొని తెమ్మని శీనుకు చెప్పాడు.
దానితో శీను, తండ్రికి విషయం తెలుస్తుందని భయపడి తన ప్రయాణం మానుకొని, తన తప్పు అంగీకరించి, జీవితంలో ఇంక ఎప్పుడూ అబద్ధం ఆడనన్నాడు.
శీను తప్పు తెలిసికొన్నాడు. కాబట్టి మంచి పిల్లవాడు.
ప్రశ్న 2.
పాఠంలో ఏ అంశానికి ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు? ఎందుకు?
జవాబు:
పిల్లలు. మంచి అలవాట్లతో, నిజాయితీతో నడవాలి. అలా నడచుకొన్నవారే, జీవితంలో గొప్పవారుగా ఎదుగుతారు. మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా, నీతి మార్గంలోనే నడవాలని, అబద్దాలు ఎప్పుడూ చెప్పగూడదని, తెలియజేయడమే ఈ పాఠంలోని ప్రధాన అంశము. పిల్లలు ఎప్పుడూ నిజమే చెప్పాలనే అంశానికే ఈ కథలో ప్రాధాన్యం ఉంది.
ఈ కథలో జున్ను తినాలనే కోరికతో అబద్దం చెప్పిన శీనును, రచయిత నేర్పుగా తెలివిగా బుజ్జగించి, ఇంక తాను ఎప్పుడూ జీవితంలో అబద్దం చెప్పనని అనిపించాడు. శీనుకు పశ్చాత్తాపం కలిగించాడు. పిల్లలను కొట్టకుండా, * తిట్టకుండా వారికి నచ్చచెప్పి, వారిని మంచిదారిలోకి తేవాలని చెప్పడమే ఈ కథలోని ప్రధాన. అంశం.
ప్రశ్న 3.
శీను, మామయ్య మాటలలో మీకు ఎక్కడ నవ్వు వచ్చింది? ఎందుకు?
జవాబు:
మామయ్య, శీనును “ఎందుకురా ఇన్ని అబద్దాలాడావు? మీ ఇంటికి మొన్ననేగా వెళ్ళివచ్చింది? ఎందుకు ఇంతలోనే బెంగ పెట్టుకొన్నావు? భయం లేదు చెప్పు” అని బుజ్జగించి అడిగాడు.
అప్పుడు శీను తమ ఇంట్లో ఆవు ఈనుతుందని, శీనుకు పెట్టకుండా తాము ఎలా ,తినగలం అని, శీను తల్లి బాధపడిందని, ఆ జున్ను కోసమే తాను తండ్రి రమ్మన్నాడని అబద్దం చెప్పానని మామయ్యతో నిజం చెప్పాడు. ఈ శీను మాటలు నాకు నవ్వు తెప్పించాయి.
అలాగే సీతయ్యతో కలిసి ఇంటికి వెడతానని శీను మామయ్యకు చెప్పాడు. దానితో మామయ్యకు సీతయ్య చెడ్డవాడనే అనుమానం వచ్చింది. సీతయ్య దుర్మార్గుడనీ, అతనితో స్నేహం వల్లనే శీను చెడిపోయాడనీ, సీతయ్య గురించి వాళ్ళ మేష్టారు తనకు చెప్పాడనీ, మామయ్య శీనును డబాయించాడు.
అప్పుడు శీను, సీతయ్య అనే పిల్లవాడే లేడని తాను సీతయ్య గురించి అబద్ధం చెప్పానని, నిజం బయటపెట్టాడు. : ఈ సందర్భంలో మామయ్య చెప్పిన డబాయింపు మాటలు, నాకు నవ్వు తెప్పించాయి.
ప్రశ్న 4.
‘కథ’ను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
రంగయ్య కుమారుడు శీను, తన మామయ్యగారి ఇంట్లో ఉండి, బడిలో చదువుతున్నాడు. మామయ్య శీనును మంచివాడిగా తీర్చిదిద్దుతాడనీ, శీనుకు అక్కడ చదివితే రెండు ముక్కలు వస్తాయనీ, రంగయ్య, శీనును మామయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు.
దసరా సెలవులకు శీను ఇంటికి వెళ్ళి స్కూలు తెరిచాక నాల్గు రోజులకు తిరిగి వచ్చాడు. తన తండ్రి తనను – నాల్గురోజులు ఉండమన్నాడనీ, సెలవు చీటి తెచ్చాను కాని పడిపోయిందనీ, శీను మామయ్యకు అబద్ధం చెప్పాడు.
తిరిగి బడికి నాల్గురోజులు సెలవులు ఇచ్చారు.. తన తండ్రి, ఆ సెలవులకు తనను తప్పక రమ్మన్నాడనీ, తమ ఊరి పిల్లవాడు సీతయ్య’ తనకు తోడుగా వస్తాడనీ, శీను మామయ్యతో అబద్ధం చెప్పాడు.
ఎందుకో, మామయ్యకు శీను అబద్దం చెపుతున్నాడనే అనుమానం వచ్చింది. ఇంతలో శీను తండ్రి రంగయ్య, మామయ్యకు బజారులో కనబడ్డాడు. శీనును తాను ఇంటికి రమ్మనలేదని రంగయ్య, మామయ్యకు చెప్పాడు.
దానితో మామయ్య, తాను శీను తండ్రికి ఉత్తరం రాసి ఇస్తానని, దానికి ఆ ఉత్తరానికి శీను తండ్రిచే జవాబు రాయించుకు రమ్మనీ, ఉత్తరం తీసుకురాకపోతే తనకు కోపం వస్తుందనీ శీనుతో చెప్పాడు.
ఉత్తరం చూస్తే, తాను అబద్ధం చెప్పానని తన తండ్రికి తెలుస్తుందని, శీను. తన ప్రయాణం మానుకున్నాడు. శీను, మామయ్యతో. నిజం చెప్పి, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడ్డాడు. ఈ విధంగా మామయ్య తెలివితో శీనును మంచిదారిలోకి మళ్ళించాడు.
ప్రశ్న 5.
మీరు ఎప్పుడైనా అబద్దాలు చెప్పారా? దానివల్ల ఏం జరిగింది?
జవాబు:
మా బడిలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు లెక్కలు పరీక్ష. ఆ రోజే మా నగరంలోకి ‘బాహుబలి’ అనే సినిమా .. వచ్చింది. ఆ రోజు శనివారం. పరీక్షలు అయిపోయాయని, ఆ రోజు స్కూలుకు సెలవు అని నేను మా అమ్మగారితో . చెప్పి, పరీక్ష ఎగగొట్టి సినీమాకు వెళ్ళాను. ఆనందంగా సినిమా చూశాను. . . పరీక్షలు అయిన తర్వాత ఒకరోజు మాకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. దానిలో లెక్కల పరీక్ష నేను రాయలేదని రాసి ఉంది. ప్రోగ్రెస్ కార్డుపై మా నాన్నగారు సంతకం చేయాలి. నేను భయపడుతూనే నాన్నగార్కినా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాను. మా నాన్నగారు దానిపై సంతకం చేసి, లెక్కల పరీక్ష ఎందుకు రాయలేదని నన్ను అడిగారు. అమ్మ అక్కడే ఉంది. నాన్న పరీక్షల టైంటేబులు చూశారు. నా తప్పు వారికి దొరికింది. నేను ఏడుస్తూ నాన్నగారి కాళ్ళపై పడి క్షమించమన్నాను. నాన్నగార్కి ఆ కోపం, ఇంకా తగ్గలేదు.
II. చదవడం – రాయడం
అ) పాఠం చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘శీను’ను గురించి వాళ్ళ మామయ్యకు గల బాధ్యతలు ఏవి?
జవాబు:
శీను ఎప్పుడయినా ఆలస్యంగా ఇంటికి పొద్దుపోయి వస్తే కోప్పడడం, శీను వేళకు. భోజనం చేస్తున్నదీ, లేని – కనుక్కోవడం, అనేవే శీను గురించి వాళ్ళ మామయ్యకు ఉన్న బాధ్యతలు.
ప్రశ్న 2.
రంగయ్య, మామయ్య ‘శీను’ను గురించి, ఏ ఏ సందర్భాలలో, ఏమేమి మాట్లాడారు?
జవాబు:
రంగయ్య తన కుమారుడు శీనును మామయ్య దగ్గర వదలి పెట్టి “కాస్త కనిపెట్టి చూస్తూ ఉండరా !” అని చెప్పాడు.
ఒకరోజు సాయంత్రం బజారులో మామయ్యకు రంగయ్య కనబడ్డాడు. “శీను చదువు ఎల్లా ఉందని” రంగయ్య మామయ్యను అడిగాడు. “చదువు ఎలా. ఉన్నా, శీను చెడుసావాసాలు చేస్తున్నట్లు నాకు అనుమానంగా ఉంది” .. అని మామయ్య రంగయ్యకు చెప్పాడు.
అప్పుడు రంగయ్య మామయ్యతో “కుర్రవాడిని బాగుచేసే బాధ్యత నీదిరా, అబ్బాయి ! మరి నీ ఇంట్లో ఉంచినది ఎందుకు? కాస్త మంచిచెడ్డ చూస్తావని కదూ ! వాడిని నీవే ఒక దారిలో పెట్టాలి. వాడు పన్నెండేళ్ళ. పిల్లాడు. ఇప్పుడే నీవు వాడిని మంచిదారిలో పెట్టాలి. అంతా నీదే భారం” అని రంగయ్య మామయ్యతో అన్నాడు.
ప్రశ్న 3.
మామయ్య, ‘శీను’ను ఊరికి పంపకపోవడానికి కారణమేమిటి?
జవాబు:
‘శీను ఈ మధ్య ఏవో కుర్రతనపు చేష్టలు చేస్తున్నాడు. శీను ఈ మధ్య దసరా సెలవులకు ఇంటికి వెళ్ళాడు. స్కూలు తెరవగానే తిరిగి రాక, నాలుగు రోజులు ఆలస్యంగా మామయ్యగారి ఇంటికి వచ్చాడు. ఎందుకురా ఆలస్యంగా – వచ్చావు? అని మామయ్య అడిగితే, తన తండ్రి ఉండమన్నాడని అబద్దం చెప్పాడు. సెలవు చీటీ తెచ్చావురా? అంటే, తెచ్చాను కాని ఎక్కడో పారవేశానని మరో అబద్దం చెప్పాడు.
ఈ విధంగా శీను అభాద్దాలు చెపుతున్నాడనే అనుమానం మామయ్యకు వచ్చింది. అందుకే, శీనునీ ఊరికి పంపడానికి మామయ్య అంగీకరించలేదు.
ప్రశ్న 4.
‘శీను’ తమ ఊరికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు?
జవాబు:
శీను దసరా సెలవుల నుండి మామయ్యగారింటికి వచ్చే రోజుననే, శీను ఇంట్లో ఆవు ఆ రోజుననో, మరునాడో ఈనుతుందని అందరూ అనుకుంటున్నారు. శీను తల్లి శీనుతో “నాయనా ! జున్ను తినకుండా వెడుతున్నావు. ఇంకో రెండు రోజులు ఉండరాదురా ! జున్ను నీకు పెట్టకుండా, మేము అందరం ఎలా తింటాం” అని ఎన్నోసార్లు అంది.
శీనుకు జున్ను తినాలని ఉంది. అందుకే శీను ఏదో అబద్ధం చెప్పి, తన ఊరుకు వెళ్ళాలనుకున్నాడు.
ప్రశ్న 5.
మామయ్య ‘సీతన్న’ గురించి ‘శీను’తో ఏం చెప్పాడు?
జవాబు:
మామయ్య శీనుతో సీతన్న గురించి ఇలా చెప్పాడు. – “ఒరే శీనూ ! ఆ సీతన్న వరివెధవ. వీధుల వెంట తిరిగే వెధవ. వాడు వర్థి అబద్ధాల కోరు. వాడు మీ ఊరు వాడయినా సరే వాడితో ఎప్పుడూ మాట్లాడకు.
ఆ సీతన్న గురించి నాకు అంతా తెలుసు. వాళ్ళ మాస్టారు కూడా సీతన్న వట్టి దుర్మార్గుడని, వాడి సహవాసం వల్ల నీవు కూడా చెడిపోతున్నావనీ నాకు చెప్పాడు.”
పై విధంగా మామయ్య శీనుతో సీతయ్య గురించి తనకు తెలిసినట్లు డబాయిస్తూ మాట్లాడాడు.
ప్రశ్న 6.
పాఠం చదవండి. అందులో ప్రశ్నా వాక్యాలను గుర్తించి, రాయండి.
జవాబు:
- ఏం కావాలిరా శీనూ?
- మళ్ళీ ఎందుకు రా వెళ్ళటం?
- ఎందుకురా శీనూ!, ఇప్పుడు నీవు మళ్ళీ ఊరికి వెళ్ళటం? మొన్ననే కదా వెళ్ళి వచ్చావు? ఇంతలోనే ఏమి తొందర?
- నిజంగా రమ్మన్నారా?
- ఏం రా? వెడతావా?
- ఏం వెళ్ళకపోతే ఏం?
- మీ నాన్న కోప్పడుతాడేం?
- నిన్ను గట్టిగా రమ్మని చెప్పాడా?
- వాడి పేరు?
- ఏ క్లాసు?
- ఏం చెయ్యాలి చెప్పు?
- ఎందుకు వెళ్ళవురా?
- హరిశ్చంద్రుడి కథ తెలుసునా?
- ఏం జేశాడూ?
- ఏం అట్లా చూస్తావు?
- ఎందుకురా శీనూ, ఇన్ని అబద్ధాలాడావు? మొ||వి.
ప్రశ్న 7.
క్రింది పేరాను చదవండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి.
“ఈ సెలవులు నాలుగు రోజులూ ఇంటి దగ్గర ఉండివస్తాను మామయ్య”, అన్నాడు శీను. “మళ్ళీ ఎందుకురా వెళ్ళటం?” అన్నాడు మామయ్య. శీను బిక్కముఖంతో అక్కడే నుంచుని ఉన్నాడు.
శీను అంటే ఎవరో కాదు. మా రంగయ్య కొడుకు. బంధుత్వం ఎల్లాగున్నా ! రంగయ్యా, నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. అందుకనే వాడు తన కుర్రవాణ్ణి నా దగ్గర వడలిపెట్టి, “కాస్త కని పెట్టి చూస్తూవుండరా ! అని చెప్పి వెళ్ళాడు.” కుర్రవాడు మామయ్య దగ్గరవుంటే వాడికో ముక్క వస్తుందని, మంచి బుద్ధిమంతుడు అవుతాడని రంగయ్య ఉద్దేశ్యం.
జవాబు:
ప్రశ్నలు :
1) శీను మామయ్యతో ఏమి చెప్పాడు?
2) శీనునీ మామయ్య ఏమని అడిగాడు?
3) శీను ఎవరు?
4) రంగయ్య, మామయ్యల సంబంధం ఏమిటి?
5) రంగయ్య మామయ్యతో ఏమి చెప్పాడు?
గయ్య కొడుకు అక్కడే నుంచును” అన్నాడు.
రాకపోయినా, చర్చయిత కోరుకున్నారులు చెప్పిన పిల్లలు పిల్లలను కొట్టకు
III. స్వీయరచన
అ) కింది ప్రశ్నలకు నాలుగు లేదా ఐదు వాక్యాలలో సమాధానాలు ఆలోచించి రాయండి.
ప్రశ్న 1.
పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలని రచయిత కోరుకున్నారు? ఎందుకు?
జవాబు:
పిల్లలకు చదువు వచ్చినా రాకపోయినా, చదువుకోడం వల్ల వారి ప్రవర్తన బాగుపడాలి. చిన్నతనంలోనే పిల్లలను కాస్త మంచి మార్గంలో పెట్టాలని రచయిత కోరుకున్నాడు. … పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. లేకపోతే మొదట అబద్దాలు చెప్పిన పిల్లలు క్రమంగా దొంగతనాలు నేర్చుకుంటారు. తరువాత స్కూలుకు ఎగగొట్టి ఎందుకూ పనికిరాకుండా పోతారు. పిల్లలను కొట్టకుండా తప్పు చేస్తే గట్టిగా చీవాట్లు వేయాలి. అబద్ధం ఆడటం తప్పని పిల్లలకు నచ్చచెప్పాలని రచయిత అనుకున్నాడు.
ప్రశ్న 2.
ఈ కథ వలన మీరు గ్రహించిన విషయాలు ఏవి?
జవాబు:
- ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు.
- సీతన్నవంటి చెడ్డపిల్లలు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యకూడదు.
- అబద్దం చెప్పిన పిల్లలను పెద్దలు కొట్టకూడదు.
- ఎందుకు వారు అబద్దం చెప్పారో బుజ్జగించి అడిగి కారణం తెలుసుకొని ఆ పిల్లల కోరికలు తీర్చాలి. ఈ కథలో శీను జున్ను తినాలనే కోరికతో అబద్దం చెప్పాడు. అందుకోసం శీను ఎన్నో అబద్దాలు ఆడాడు. మామయ్య లేఖ రాసిస్తాననీ, దానికి శీను తండ్రి చేత జవాబు రాయించుకు రమ్మని చెప్పాడు. తండ్రికి ‘ విషయం తెలుస్తుందని శీను తన తప్పును అంగీకరించి ఇంక ఎప్పుడూ అబద్దం చెప్పనని మామయ్యకు మాట ఇచ్చాడు.
- దీనిని బట్టి పిల్లలను తెలివిగా మంచిదారిలోకి తేవాలని ఈ కథ ద్వారా నేను గ్రహించాను.
- ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా నీతి మార్గంలో నడవాలనీ, అబద్ధం చెప్పరాదనీ ఈ పాఠం వల్ల నేను గ్రహించాను.
ప్రశ్న 3.
చెడ్డవాళ్ళతో స్నేహం చేయగూడదని రచయిత అన్నారు కదా ! అందువల్ల కలిగే నష్టాలు ఏవి?
(లేదా)
చెడ్డ వాళ్ళతో స్నేహం చేయరాదని పెద్దవారు చెబుతారు కదా ! అందువల్ల కలిగే నష్టాలను మీ పాఠ్యాంశము ఆధారంగా వివరించండి.
జవాబు:
చెడ్డవారితో స్నేహం చేస్తే వారి చెడుగుణాలు స్నేహం చేసిన వారికి వస్తాయి. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే, అబద్ధాలు చెప్పడం, బడి మానివేయడం, పేకాట ఆడడం, సిగరెట్లు, బీడీలు కాల్చడం, సినిమాలకు తరచుగా వేళ్ళడం, త్రాగడం వగైరా చెడు గుణాలు సంక్రమిస్తాయి.
ప్రశ్న 4.
‘శీను’కు రచయిత ఎలా బుద్ధి చెప్పారో రాయండి.
జవాబు:
శీను’ సెలవులకు తనను ఇంటికి తప్పక రమ్మని, తన తండ్రి చెప్పాడని, రచయితతో అబద్ధం చెప్పాడు. రచయితకు శీను తండ్రి బజారులో కనబడి, తాను శీనును రమ్మని చెప్పలేదని చెప్పాడు.
అప్పుడు రచయిత తాను ఒక ఉత్తరం, శీను తండ్రికి రాసి ఇస్తానని, దానికి తప్పకుండా శీను తండ్రి చేత . జవాబు రాయించుకొని తేవాలని, శీనుకు చెప్పాడు. రచయిత రాసిన ఉత్తరం చదివితే తండ్రికి నిజం తెలుస్తుందని శీను భయపడి, తాను సెలవులకు ఇంటికి వెళ్ళనని చెప్పాడు. అంతేగాక తాను జున్ను తినాలని అబద్దం – చెప్పానని అంగీకరించాడు. ఇంక ఎప్పుడూ అబద్దం. చెప్పనన్నాడు. ఈ విధంగా తెలివిగా, రచయిత .శీనుకు .. బుద్ధి చెప్పాడు.
ప్రశ్న 5.
“శీను విధేయతతో తల ఊపుతూ బస్సు ఎక్కాడు. నేను కిందనే నుంచున్నాను. ఇలా పాడు పైన – నేను కింద ఉన్నామని” రచయిత అన్నాడు కదా ! ఈ మాటల వల్ల మీరు ఏమి గ్రహించారో రాయండి.
జవాబు:
సీతయ్య అన్నవాడు తనకు తెలుసునని రచయిత శీను దగ్గర డబాయించాడు. ఆ సీతయ్యే శీనుకు మీ మామయ్యతో ఇలా చెప్పి రారా” అని బోధించి ఉంటాడని రచయిత అనుకున్నాడు. అందుకే శీను దుర్మార్గుడని వాడి – స్నేహంతోనే శీను చెడిపోతున్నాడని, సీతయ్య మాష్టారు కూడా తనకు చెప్పాడని రచయిత శీనును గట్టిగా .. దబాయించాడు.
రచయిత మాటలన్నీ విన్న శీను సీతయ్య అన్నవాడు లేనేలేడని, మెల్లగా నిజం బయటపెట్టాడు. ఈ విధంగా అబద్ధాలు కల్పించి చెప్పడంలో, రచయిత కన్నా శీను పైన ఉన్నాడని, రచయిత కింద ఉన్నాడని కథా. రచయిత చమత్కరించి చెప్పాడు.
ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘శీను’ గురించి రాయండి.
జవాబు:
శీను రంగయ్యకు పుత్రుడు. రంగయ్య తనకు మిత్రుడూ, శీనుకు మామయ్య అయిన రచయిత ఇంట్లో ఉంచి శీనును చదివిస్తున్నాడు. శీనును రచయిత కనిపెట్టి చూస్తాడని రంగయ్య ఆశ.
శీను ఈ మధ్య అబద్దాలు ఆడుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి తన తండ్రి ఉండమన్నాడని బడి తెరిచాక నాల్గు రోజులకు తిరిగి వచ్చాడు. సెలవు చీటీ తెచ్చాను కాని ఎక్కడో పారవేశానన్నాడు.
మళ్ళీ నాల్గు రోజులు సెలవులు వచ్చాయి. ‘ శీను ఇంట్లో ఆవు ఈనుతోంది. దాని జున్ను తినాలని శీను ఆశపడ్డాడు. తండ్రి’ రమ్మన్నాడని, తమ ఊరి సీతయ్యతో కలిసి వెడతానని మామయ్యతో అబద్దం చెప్పాడు.
మామయ్యకు శీను అబద్దం చెపుతున్నాడని ఎందుకో తోచింది. బజారులో శీను తండ్రి రంగయ్య, శీనుమామయ్యను కలిశాడు. శీనును తాను ఇంటికి రమ్మనలేదని చెప్పాడు.
అప్పుడు శీను మామయ్య, శీనుతో, తాను శీను తండ్రికి ఉత్తరం రాసి ఇస్తానని, దానికి శీను తండ్రిచే జవాబు తప్పక రాయించి తెమ్మనీ చెప్పాడు – మామయ్య ఉత్తరం చూస్తే తండ్రికి నిజం తెలుస్తుందని, శీను తన తప్పు ఒప్పుకున్నాడు. ఇంక జీవితంలో ఎప్పుడూ అబద్దం చెప్పనని మామయ్యకు శీను చెప్పాడు. మామయ్య జాలిపడి, శీనును జున్ను తినడానికి ఇంటికి పంపాడు.
ప్రశ్న 2.
పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
శీనువచ్చి ఈ నాలుగు సెలవు రోజుల్లో వాళ్ళ ఇంటికి వెడతానని మామయ్యను అడిగాడు. శీను మామయ్య – గారింట్లో ఉండి చదువుకుంటున్నాడు. శీను తండ్రి రంగయ్య. మామయ్య శ్రద్ధగా చదివిస్తాడని శీనును మామయ్య గారింటి దగ్గర రంగయ్య ఉంచాడు. శీనును మామయ్య జాగ్రత్తగా చూస్తున్నా ఈ మధ్య అబద్ధాలు చెపుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి బడి తెరిచిన నాల్గు రోజులకు వచ్చాడు. వాళ్ళ నాన్న, ఉండమన్నాడని మామయ్యతో అబద్దం చెప్పాడు. మామయ్యకు శీను ‘మీద అనుమానం వచ్చింది.
శీను తండ్రి రంగయ్య బజా మామయ్యకు కనబడి శీనును తాను రమ్మనలేదని చెప్పాడు. దానితో శీను అబద్దాలు ఆడుతున్నాడని మామయ్య గ్రహించాడు. శీనును తిడదామని మామయ్య అనుకున్నాడు. శీను ప్రయాణం ఆపాలని నీవు ఒక్కడివీ ఎలా వెడతావురా అని మామయ్య శీనును అడిగాడు. తన ఊరి పిల్లాడు సీతయ్యతో కలిసి వెడతానన్నాడు శీను.
మామయ్య శీనును వెళ్ళమని చెప్పాడు. శీను తండ్రికి తాను ఉత్తరం రాసి ఇస్తానని, దానికి తప్పక జవాబు రాయించి తెమ్మని, తేకపోతే తనకు కోపం వస్తుందనీ మామయ్య శీనుతో అన్నాడు.
ఉత్తరం చూస్తే తాను అబద్దం ఆడినట్లు తండ్రికి తెలుస్తుందని శీను ప్రయాణం మానివేశాడు. అప్పుడు మామయ్య శీనును మందలించాడు.
తరువాత ఎందుకు అబద్దమాడావురా ? అని మామయ్య శీనును అడిగి తెలుసుకున్నాడు. శీను జున్ను తినాలని అబద్దం చెప్పాడని మామయ్య జాలిపడి శీనును వాళ్ళ ఇంటికి బస్సు ఎక్కించి పంపాడు.
IV. పదజాలం
అ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాక్యాలను తిరిగి రాయండి.
1. పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పాలి.
జవాబు:
ప్రవర్తన = నడవడి – వాక్యము
తిరిగి రాయడం : పిల్లలకు మంచి నడవడి నేర్పాలి.
2. రచయిత, ‘శీను’కి ఏ సంగతి చెప్పలేదు.
జవాబు:
సంగతి = సమాచారము
వాక్యము తిరిగి రాయడం : రచయిత శీనుకి ఏ సమాచారము చెప్పలేదు.
3. రంగయ్య బజారులో హఠాత్తుగా కనిపించాడు.
జవాబు:
హఠాత్తుగా = అకస్మాత్తుగా
వాక్యము తిరిగి రాయడం : రంగయ్య బజారులో అకస్మాత్తుగా కనిపించాడు.
4. విద్యార్థులు అల్లరి చేష్టలు చేయగూడదు.
జవాబు:
చేష్టలు = పనులు
వాక్యము తిరిగి రాయడం : విద్యార్థులు అల్లరి పనులు చేయగూడదు.
5. పెద్దలు, పిల్లల అభివృద్ధికి బాధ్యత వహించాలి.
జవాబు:
బాధ్యత = పూచీ
వాక్యము తిరిగి రాయడం : పెద్దలు పిల్లల అభివృద్ధికి పూచీ వహించాలి.
ఆ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు, వ్యతిరేకార్థాలనిచ్చే పదాలు పట్టికలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
- మా ఆవిడిచ్చిన వెచ్చని కాఫీ త్రాగుతూ, కూర్చున్నాను.
- నేను రంగయ్య మంచి స్నేహితులం.
- శీను ఇంటికి ఆలస్యంగా వచ్చాడు.
- ఆ రోజు సాయంత్రం రంగయ్య కనిపించాడు.
- పిల్లవాన్ని సన్మార్గంలో పెట్టాలి.
- వాడికి ధైర్యం లేకపోయింది.
ఉదా :
1. చల్లని
2. చెడు
3. తొందరగా
4. ఉదయం
5. చెడు మార్గం
6. అధైర్యం
సొంతవాక్యాలు :
- చల్లని ఆ : నేను చల్లని మంచి నీళ్ళు తాగుతాను.
- చెడు : పిల్లలు చెడు అలవాట్లకు సులభంగా లొంగుతారు.
- తొందరగా : బడికి రోజూ తొందరగా వెళ్ళాలి.
- ఉదయం : నేను ఉదయం లేవగానే దేవుడికి నమస్కరిస్తాను.
- చెడు మార్గం : పిల్లలు చెడు మార్గంలోకి పోకుండా పెద్దలు శ్రద్ధ చూపాలి.
- అధైర్యం : పరీక్షలంటే, పిల్లలు అధైర్యం చెందరాదు.
ఇ) కింది రెండు వరసల నుంచి ఏవైనా రెండు మాటలు తీసుకొని, వాటిని ఒకే వాక్యంతో ఉపయోగించి రాయండి.
ఉదా :
1) నిజం – అ) కీర్తి
2) ఊరు – ఆ) కష్టాలు
3) మంచి – ఇ) ప్రయాణం
4) చెడు స్నేహం – ఈ) సక్రమంగా
5) బస్సు – ఉ) సెలవులు
6) బడి – ఊ) అబద్ధం
ఉదా :
1. నిజం, అబద్దం : మనం ఎప్పుడూ నిజమే చెప్పాలిగాని అబద్దం చెప్పగూడదు.
2. ఊరు, సెలవులు : ఈ సెలవులకు తప్పక మా ఊరు వెడతాను.
3. మంచి, కీర్తి : మంచి గుణవంతుడికి, కీర్తి వస్తుంది.
4. చెడు స్నేహం, కష్టాలు: చెడు స్నేహం వలన కష్టాలు వస్తాయి.
5. బస్సు, ప్రయాణం : ఎ.సి. బస్సులో ప్రయాణం, సుఖంగా ఉంటుంది.
6. బడి, సక్రమంగా : విద్యార్థులు బడికి రోజూ సక్రమంగా వెళ్ళాలి.
ఈ) పాఠం ఆధారంగా కింది పదాల అర్థాలను తెలుసుకోండి. వీటిని సొంతవాక్యాలలో రాయండి.
1. తెల్లముఖం వేయడం అంటే : వెలవెల పోవడం అని అర్థం.
వాక్య ప్రయోగం : గురువుగారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక, పిల్లలు తెల్లముఖం వేశారు.
2. బుజ్జగించడం అంటే : మారాము చేసేవారిని, మంచి మాటలు చెప్పి ఓదార్చి, ఒప్పించడం అని అర్థము.
వాక్య ప్రయోగం : కొత్త బట్టలు కావాలని ఏడుస్తున్న తమ్ముణ్ణి మా అమ్మ ఎలాగో బుజ్జగించింది.
3. బిక్కమొఖం వేయడం అంటే : భయంతో తెల్లమొగం వేయడం అని అర్థం.
వాక్య ప్రయోగం : బడి మాని సినిమాకు వెళ్ళిన తమ్ముణ్ణి, అమ్మ నిలదీసి ప్రశ్నిస్తే, వాడు బిక్కమొఖం వేశాడు.
4. ఎగగొట్టడం అంటే : తీర్చవలసిన ఋణం మొదలయిన వాటిని తీర్చకపోడం, చేయవలసిన పనిని మానివేయడం.
వాక్య ప్రయోగం :
1) రామయ్య బ్యాంకు నుండి తెచ్చుకొన్న ఋణాన్ని ఎగగొట్టాడు.
2) నా మిత్రుడు నిన్న బడికి ఎగగొట్టాడు.
5. చీవాట్లు వేయడం అంటే : తిట్టడం లేక నిందించడం అని అర్థం.
వాక్య ప్రయోగం : నా మీత్రుడు బడికి ఎగగొట్టాడని తెలిసి, వాళ్ళ నాన్నగారు వాడికి చీవాట్లు వేశారు.
V. సృజనాత్మకత
1. పాఠ్యాంశం ఆధారంగా రచయితకూ, ‘శీను’కూ జరిగే సంభాషణలను రాయండి.
జవాబు:
రచయిత : ఏం కావాలిరా శీనూ?
శీను : ఈ సెలవులు నాల్గు రోజులు ఇంటి దగ్గర ఉండి వస్తాను.
రచయిత : మళ్ళీ ఎందుకురా వెళ్ళటం. మొన్నేకదా, వచ్చావు.
శీను : నాన్న తప్పకుండా రమ్మన్నాడు.
రచయిత : సరే ! అవసరం అయితే వెళ్ళుదువుగానిలే. నీవు ఒక్కడివీ ఎల్లా వెడతావురా?
శీను : మా ఊరి పిల్లాడు సీతయ్యతో కలిసి వెడతా.
రచయిత : సరే. నీకు ఒక ఉత్తరం రాసి ఇస్తా. అది మీ నాన్నకు ఇచ్చి దానికి జవాబు రాయించుకొని రావాలి.
రచయిత : నేను చెప్పిన విషయాలు తెలిశాయా?
శీను : (ఏడ్పు ముఖంతో) మా నాన్న చేత ఉత్తరం రాయించుకు రావాలి.
రచయిత : ఏం రా శీనూ ! డబ్బు కావాలా?
శీను : అక్కరలేదు. నేను వెళ్ళను మామయ్య.
రచయిత : ఎందుకు వెళ్ళవురా?
శీను : (తలవంచి తెల్లముఖం వేశాడు)
రచయిత : వెధవా చెడిపోతున్నావు. ప్రాణం పోయినా ‘అబద్దం ఆడకూడదు. తెలిసిందా?
శీను : తెలిసింది.
రచయిత : హరిశ్చంద్రుడి కథ తెలుసునా?
శీను : తెలుసు. ఎప్పుడూ అబద్దం ఆడలేదు.
రచయిత : అదీ మన ఆదర్శం. ఇక నుంచి ఎప్పుడూ నిజమే చెప్పాలి. చెడ్డ పిల్లలతో స్నేహం వద్దు.
శీను : సరే మామయ్యా ! నన్ను క్షమించు. తప్పు చేశా.
VI. ప్రశంస
* ఇచ్చిన మాటకోసం లేదా ‘సత్యం’ కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులను గురించి ప్రశంసిస్తూ మాట్లాడండి.
జవాబు:
1) బలిచక్రవర్తి :
వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేస్తానన్నాడు. వామనుడు విష్ణుమూర్తి అని, మూడు అడుగులు దానం చేస్తే బలిచక్రవర్తికి ప్రమాదం వస్తుందని బలిచక్రవర్తిని గురువు శుక్రుడు హెచ్చరించాడు. అయినా బలిచక్రవర్తి గురువు మాటను కాదని వామనుడికి దానం చేశాడు.
2) కర్ణుడు :
కర్ణుడు తన సహజ కవచకుండలాలను కోసి దేవేంద్రుడికి ఇచ్చాడు. అలా ఇవ్వవద్దని, కర్ణుడిని అతని తండ్రి సూర్యుడు హెచ్చరించినా వినకుండా కర్ణుడు దేవేంద్రుడికి తన కవచకుండలాలు ఇచ్చాడు.
3) హరిశ్చంద్రుడు :
హరిశ్చంద్రుడు, తాను అన్నమాట కోసం తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి ఇచ్చాడు. తనను, భార్యను అమ్ముకొని గురువుగారికి ఇవ్వవలసిన మొత్తాన్ని చెల్లించాడు.
4) ఆవు :
తనను తినబోయిన ‘పులికి ఇచ్చినమాట ప్రకారం ఆవు తన దూడకు పాలిచ్చి తిరిగివచ్చి తనను తినమని పులిని బ్రతిమాలింది.
5) దిలీపుడు :
దిలీపుడు నందినీ, ధేనువును రక్షించడం కోసం, సింహానికి తన శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు.
ఆవు :
అమ్మకొని గురువుగారి అను అన్నమాట కోసి
VII. ప్రాజెక్టు పని
* ‘నిజం’ గొప్పతనాన్ని తెలిపే కథలను సేకరించండి. వాటిని మీ తరగతిలో చదివి వినిపించండి; ప్రదర్శించండి.
జవాబు:
- ఆవు – పులి కథ
- సత్యహరిశ్చంద్రుని కథ
- బలిచక్రవర్తి కథ మొదలయిన వాటిని సేకరించుట.
విద్యార్థి కృత్యం.
VIII. భాషను గురించి తెలుసుకుందాం
అ) కింది పదాలను విడదీయండి.
1. ఉదా : వసుధైక = వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ)
అ. రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ)
ఆ. సురైక = సుర + ఏక = (అ + ఏ = ఐ)
ఇ. ఏకైక క = ఏక + ఏక = (అ + ఏ = ఐ)
2. ఉదా : సమైక్య = సమ – + ఐక్య = (అ + ఐ = ఐ)
ఈ. అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
ఉ. దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
3. ఉదా : పాపౌఘము = పాప + ఓఘము = (అ + ఓ = ఔ)
ఊ. దివాకసులు = దివ + ఓకసులు = (అ + ఓ = ఔ)
ఎ. వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఔ)
4. ఉదా : రసౌచిత్యం = రస + ఔచిత్యము = (అ + ఔ = ఔ)
ఏ. దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ)
ఐ. దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ)
గమనిక : పై పదాలను విడదీసినపుడు, ప్రతి పదంలోనూ పూర్వపదము యొక్క చివరి అక్షరం ‘అ’ కారం (‘అ’ – అక్షరం) ఉంది. అలాగే పరస్పరం (పరపధంలోని మొదటి అక్షరమైన అచ్చు) స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ — లు ఉన్నాయి. ఇలా ‘అ’కారానికి, ఏ, ఐ – లు కలిసినప్పుడు ‘ఐ’ వచ్చింది. ‘అ’ కారానికి ఓ, ఔ – లు కలిసినపుడు ‘ఔ’ వచ్చింది. దీనిని “వృద్ధి సంధి” అంటారు.
గమనిక :
ఐ, ఔ – లను వృద్ధులు అంటారు. వీటితో ఏర్పడే సంధి “వృద్ధి సంధి”.
వృద్ధిసంధి : సూత్రము :
అకారానికి ఏ, ఐలు పరమైనప్పుడు ‘ఐ’ కారము, ఓ, ఔ లు పరమైనపుడు ‘ఔ’ కారము ఏకాదేశమగును.
ఆ) కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించండి.
అ. అభ్యుదయం = అభి – + ఉదయం = (ఇ + ఉ = య్) – యణాదేశసంధి
ఆ. సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) – గుణసంధి
ఇ. మహౌషధం = మహా + ఔషధం – (ఆ + ఔ = ఔ) – వృద్ధిసంధి
ఈ. భాషాన్నత్యం = భాషా + ఔన్నత్యం = (ఆ + ఔ = ఔ) – వృద్ధిసంధి
ఉ. లోకైక = లోక + ఏక = (అ + ఏ = ఐ) – వృద్ధిసంధి
ఊ. లఘూత్తరం = లఘు + ఉత్తరం = (ఉ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
ఎ. మాతృణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి.
ఏ. అణ్వస్త్రం = అణు + అస్త్రం = (ఉ + అ = వ్) – యణాదేశసంధి
పాఠంలోని వ్యతిరేకపదాలు
వెచ్చని × చల్లని
వెనుక × ముందు
స్నేహితులు × శత్రువులు
బుద్ధిమంతుడు × బుద్దిహీనుడు
జాగ్రత్త × అజాగ్రత్త
నిజము × అబద్ధము
అవసరం × అనవసరం
సన్మార్గం × దుర్మార్గంలో
ధైర్యం × అధైర్యం
దుఃఖం × సుఖం
ప్రశ్న × జవాబు
విచారం × ఆనందం
నమ్మకం × అపనమ్మకం
పాపం × పుణ్యం
భయం × అభయం
ప్రకృతి – వికృతి
ఘంటా – గంట
ముఖం – మొగం
భక్తి – బత్తి
ప్రయాణము – పయనము
నిమిషం – నిముసం
బ్రద్నుడు – ప్రొద్దు
స్నేహం – నెయ్యము
ప్రాణం – పానం
కథ – కత
సన్యాసి – సన్నాసి
సంతోషం – సంతసం
పుస్తకం – పొత్తము
కంఠము – గొంతు
ఆశ్చర్యం – అచ్చెరువు
సమానార్ధక పదాలు (పర్యాయపదాలు)
1. భార్య : 1) పెళ్ళాము, 2) ఇల్లాలు, 3) ఆలు
2. కొడుకు : 1) కుమారుడు, 2) సుతుడు, 3) తనయుడు
3. స్నేహితుడు : 1) మిత్రుడు, 2) నేస్తము, 3) హితుడు
4. ఊరు : 1) గ్రామము, 2) పల్లె
5. నాన్న : 1) తండ్రి, 2) అయ్య, 3) జనకుడు
6. చేయి : 1) చెయ్యి, 2) కరము, 3) హస్తము
7. అబద్ధము : 1) అసత్యము, 2) కల్ల, 3) బొంకు
8. ముఖము : 1) ఆననము, 2) మొగము, 3) మోము
సమాసములు – విగ్రహవాక్యాలు
సమాస పదం | విగ్రహవాక్యం | సమాస నామం |
1. తల్లిదండ్రులు | తల్లి, తండ్రి | ద్వంద్వ సమాసం |
2. భయభక్తులు | భయము, భక్తి | ద్వంద్వ సమాసం |
3. రెండు రూపాయలు | రెండు (2) సంఖ్యగల రూపాయలు | ద్విగు సమాసం |
4. తొమ్మిది గంటలు | తొమ్మిది (9) సంఖ్యగల గంటలు | ద్విగు సమాసం |
5. రెండు అబద్దాలు | రెండు (2) సంఖ్యగల అబద్ధాలు | ద్విగు సమాసం |
6. రెండు చొక్కాలు | రెండు (2) సంఖ్యగల చొక్కాలు | ద్విగు సమాసం |
రచయిత పరిచయం
రచయిత : మునిమాణిక్యం నరసింహారావు
జననం : 15-03-1898.
మరణం : 1972వ సంవత్సరం.
జన్మస్థలం : సంగం జాగర్లమూడి (గ్రామం) తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా.
రచనలు :
- కాంతం కథలు
- కాంతం కైఫీయత్
- కాంతం కాపురం
- మేరీ కహానీ – మొదలైన 24 పుస్తకాలు రచించారు.
- దాంపత్యోపనిషత్తు
- వినోద వ్యాసములు – మొదలైన వ్యాస సంపుటాలు రచించారు.
- ‘మన హాస్యం’ అనే హాస్యాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథము వ్రాశారు.
హాస్యరస సృష్టికర్త : వీరు దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కార భరితంగా, చిత్రించిన గొప్ప రచయిత. తెలుగు కథా సాహిత్యంలో వీరు సృష్టించిన ‘కాంతం’ పాత్ర, జీవవంతమైనది.
రచనా శైలి : చమత్కారమును పుట్టించే సులభశైలి, ఆకర్షణీయమైన కథా శీర్షికలు, మునిమాణిక్యం గారి రచనలకు వన్నె తెచ్చాయి.
ఉద్యోగం : వీరు ఉపాధ్యాయులుగా, ఆకాశవాణిలో విద్యావిషయ ప్రసారాలకు సహాయ ప్రయోక్తగా పనిచేశారు.
వీరి కథలోని ప్రధానాంశాలు :
- సజీవమైన వాడుక భాష
- అచ్చమైన తెనుగు నుడికారం
1. ‘నిజం నిజం’ కథ రాసిన హాస్యకథా రచయిత మునిమాణిక్యం గారిని గూర్చి రాయండి.
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావుగారు గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1898లో పుట్టారు. వీరు . ఉపాధ్యాయులుగా, ఆకాశవాణిలో విద్యావిషయాల ప్రయోక్తగా పనిచేశారు. వీరు దాంపత్య జీవితాన్ని చమత్కారంగా చిత్రించిన హాస్యకథా రచయిత. వీరు కాంతం కథలు, కాంతం కాపురం, దాంపత్యోపనిషత్తు, వంటి గ్రంథాలు రచించారు. హాస్యాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథం “మన హాస్యం” రచించారు.
కొత్త పదాలు-అర్థాలు
43వ పేజి
తమాషా = గమ్మత్తు
గిరుక్కున ఆ = శీఘ్రముగా తిరుగుటలో అనుకరణము (తొందరగా)
నిక్కరు = లాగు
షర్టు – = చొక్కా
బిక్క ముఖంతో = తెల్ల మొఖంతో (బెదరుతున్న ముఖంతో)
వాడికో ముక్క వస్తుందని = వాడికి కొద్దిగానైనా చదువు వస్తుందని
కుర్రతనపు చేష్టలు = చిన్నపిల్లవాడి పనులు
బిక్కముఖం పెట్టి = బెదరుతున్నట్లు ముఖం పెట్టి
44వ పేజి
తోచలేదు = స్పురించలేదు
నిర్బంధించడం = బలవంతపెట్టడం
హఠాత్తుగా = అకస్మాత్తుగా (అనుకోకుండా)
సంగతి = సమాచారము
సహవాసాలు = స్నేహాలు
ఒక దారిని పెట్టాలి = ఒక మంచి మార్గంలోకి నడిపించాలి
సన్మార్గం = (సత్ + మార్గం) . : = మంచి మార్గం (మంచి దారి)
భారం = బాధ్య త
వఠ్ఠిది = అసత్యమైనది
ఎగగొట్టి = ఎగవేసి (మాని)
చెయ్యి చేసుకోవలసిన అవసరం = కొట్టవలసిన అవసరం
ఈ దఫా = ఈ పర్యాయము
చీవాట్లు వేయు = మందలించు, తిట్టు
పిల్లిలాగ = నెమ్మదిగా, నిశ్శబ్దంగా
బ్రహ్మాండమైన = బాగా గొప్పదైన
బాదుదాము = కొడదాము
నచ్చజెప్పాలి = నచ్చేటట్లు చెప్పాలి
45వ పేజి
ఫోర్తు ఫారం = 9వ తరగతి
తల ఊపాడు = అంగీకరిస్తున్నట్లు తల తిప్పాడు
హడలిపోయేలాగున = భయపడే విధంగా
అక్కర లేదన్నాడు . = అవసరం లేదని చెప్పాడు
బైట పడుతుంది = వెల్లడి అవుతుంది (తెలిసిపోతుంది)
చీవాట్లు వేయటానికి = తిట్టడానికి
తెల్లముఖం వేశాడు = వెలవెల పోయాడు
వఠ్ఠి అబద్ధం = పూర్తిగా అసత్యం
ఓర్చుకున్నాడు = సహించాడు
ఆదర్శం = ఇతరులు చూసి నేర్చుకోదగిన గుణం
సహవాసం = స్నేహం
పాడైపోయినావు = చెడిపోయావు
46వ పేజి
సన్యాసి = అన్నింటినీ విడిచినవాడు
చీదరించుకొనేసరికి = కోపపడే సరికి
పశ్చాత్తాపం = తాను చేసినది తప్పని తెలిసినప్పుడు, అలా తాను చేశానే అని, బాధపడడం
వెక్కివెక్కి ఏడ్వటం = గట్టిగా ఏడ్వడం
సన్మార్గం (సత్ + మార్గం) = మంచి దారి
ఆదుర్థాపడు = ఆందోళన పడు
ఆరాటం = సంతాపము
ఖిన్నుడై (ఖిన్నుడు + ఐ) = దుఃఖము పొందినవాడై
బుజ్జగించి = బ్రతిమాలి
మాట పెగిలిరాలేదు = నోట మాటరాలేదు
రుద్దకంఠంతో = ఏడ్పు కంఠంతో
బస్టాండు (Bus stand) = బస్సులు ఆగే స్థలము
వ్యర్ధము = వృథా, ప్రయోజనం లేకపోడం
47వ పేజి
ఎరిగి ఉన్నట్లు = తెలిసినట్లు
డబాయిస్తే కాని = తనకు తెలిసినట్లు నటిస్తే కాని
బైట పెట్టడు = వెల్లడించడు, పైకి చెప్పడు
దుర్మార్గుడు . = చెడ్డవాడు
కళ్ళ నీళ్ళు కుక్కుకుంటూ = కళ్ళ నుండి వచ్చే నీరు తుడుచుకుంటూ (ఆపుకుంటూ)
గర్జించాను = గట్టిగా అరచాను
ఒళ్ళు = శరీరము
తెప్పరిల్లి = దుఃఖము నుండి తేరుకొని
విధేయతతో = వినయముతో
AP Board Textbook Solutions PDF for Class 7th Telugu
- AP Board Class 7
- AP Board Class 7 Telugu
- AP Board Class 7 Telugu Chapter 1 అక్షరం
- AP Board Class 7 Telugu Chapter 2 మాయాకంబళి
- AP Board Class 7 Telugu Chapter 3 చిన్ని శిశువు
- AP Board Class 7 Telugu Chapter 4 మర్రిచెట్టు
- AP Board Class 7 Telugu Chapter 5 పద్య పరిమళం
- AP Board Class 7 Telugu Chapter 6 మన విశిష్ట ఉత్సవాలు
- AP Board Class 7 Telugu Chapter 7 కప్పతల్లి పెళ్ళి
- AP Board Class 7 Telugu Chapter 8 ఎద
- AP Board Class 7 Telugu Chapter 9 హితోక్తులు
- AP Board Class 7 Telugu Chapter 10 ప్రియ మిత్రునికి
- AP Board Class 7 Telugu Chapter 11 బాలచంద్రుని ప్రతిజ్ఞ
- AP Board Class 7 Telugu Chapter 12 స్ఫూర్తి ప్రదాతలు
- AP Board Class 7 Telugu 7th Class Telugu Grammar
- AP Board Class 7 Telugu వ్యాసాలు
- AP Board Class 7 Telugu కరపత్రాలు / లేఖలు
- AP Board Class 7 Telugu పదాలు – అర్థాలు
- AP Board Class 7 Telugu Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ
- AP Board Class 7 Telugu Chapter 2 అతిథి మర్యాద
- AP Board Class 7 Telugu Chapter 3 ఆనందం (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu Chapter 4 మేలిమి ముత్యాలు
- AP Board Class 7 Telugu Chapter 5 తెలుగు వెలుగు
- AP Board Class 7 Telugu Chapter 6 ఎందుకు పారేస్తాను నాన్నా! (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu Chapter 7 శిల్పి
- AP Board Class 7 Telugu Chapter 8 నిజం-నిజం
- AP Board Class 7 Telugu Chapter 9 కూచిపూడి నాట్యం (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu Chapter 10 ప్రకటన
- AP Board Class 7 Telugu Chapter 11 సీత ఇష్టాలు
- AP Board Class 7 Telugu Chapter 12 అసామాన్యులు (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu Chapter 13 ఆలోచనం (?)
- AP Board Class 7 Telugu Chapter 14 కరపత్రం
- AP Board Class 7 Telugu Chapter 15 జానపద కళలు (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu Chapter 16 బాల్య క్రీడలు
- AP Board Class 7 Telugu Chapter 17 వేసవి సెలవుల్లో (ఉపవాచకం)
- AP Board Class 7 Telugu 7th Class Telugu Grammar
- AP Board Class 7 Telugu వ్యాసాలు
- AP Board Class 7 Telugu కరపత్రాలు / లేఖలు
- AP Board Class 7 Telugu పదాలు – అర్థాలు
0 Comments:
Post a Comment