![]() |
AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Solutions PDF: Download Andhra Pradesh Board STD 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Book Answers |
Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbooks Solutions PDF
Andhra Pradesh State Board STD 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Books Solutions with Answers are prepared and published by the Andhra Pradesh Board Publishers. It is an autonomous organization to advise and assist qualitative improvements in school education. If you are in search of AP Board Class 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Books Answers Solutions, then you are in the right place. Here is a complete hub of Andhra Pradesh State Board Class 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని solutions that are available here for free PDF downloads to help students for their adequate preparation. You can find all the subjects of Andhra Pradesh Board STD 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbooks. These Andhra Pradesh State Board Class 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbooks Solutions English PDF will be helpful for effective education, and a maximum number of questions in exams are chosen from Andhra Pradesh Board.Andhra Pradesh State Board Class 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Books Solutions
Board | AP Board |
Materials | Textbook Solutions/Guide |
Format | DOC/PDF |
Class | 9th |
Subject | Maths |
Chapters | Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని |
Provider | Hsslive |
How to download Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Solutions Answers PDF Online?
- Visit our website - Hsslive
- Click on the Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Answers.
- Look for your Andhra Pradesh Board STD 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbooks PDF.
- Now download or read the Andhra Pradesh Board Class 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Solutions for PDF Free.
AP Board Class 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbooks Solutions with Answer PDF Download
Find below the list of all AP Board Class 9th Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Solutions for PDF’s for you to download and prepare for the upcoming exams:9th Class Telugu ఉపవాచకం 2nd Lesson నేనూ సావిత్రీబాయిని Textbook Questions and Answers
కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
సావిత్రీబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి?
జవాబు:
సావిత్రీబాయి కాలంలో ఆడవాళ్ళు గడప దాటకూడదు. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పొయ్యికి కట్టుబడి ఉండాలి. ఆడపిల్ల నియమాలను ఎంతమాత్రం దాటరాదు.
ఆ రోజుల్లో పొయ్యిలో కర్రలూ, పొయ్యి ఊదే గొట్టం ఆడపిల్ల చేతిలో ఎప్పుడూ ఉండాల్సిందే. ఆడపిల్ల ఆ గొట్టంతో పొయ్యిని ఊదుతూ ఉండాల్సిందే. ఆడపిల్ల భర్తనూ, అత్తమామల్ని సేవించుకోవాలి. ఇప్పుడు రెండవతరగతి చదివే వయస్సులోనే ఆనాడు ఆడపిల్లలు అత్తవారింట్లో ఉండేవారు. అత్తవారి ఇల్లే ఆడపిల్ల అసలు ఇల్లని ఆ రోజుల్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు నొక్కి చెప్పేవారు.
ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుందని, బుద్ధిలేనిది అవుతుందని అప్పటివారు నమ్మేవారు. ఆనాడు సావిత్రి ఆడపిల్లలకు చదువు చెప్పడానికి బడికి పోతూంటే, జనం కిటికీల వెనుక నిలబడి తిట్టేవారు. శాపనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలు అనేవారు.
ప్రశ్న 2.
సేజ్ అంటే ఎవరు? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించండి.
జవాబు:
పేజీ అంటే సావిత్రీబాయి భర్త “జ్యోతీరావ్ ఫూలే”. ఫూలే సేజ్, పూనాలో ఉండే ఫూలే కుటుంబంలో పుట్టాడు. సేజీకి ఎప్పుడూ బడి, పుస్తకాలు, చదువు అంటే ఇష్టం. సావిత్రీబాయి, జ్యోతీరావ్ ఫూలేని సేజ్ అనే పిలిచేది.
మనిషి మంచివాడయితే, అతడు మనదేశం వాడయినా, విదేశీయుడయినా సరే, ఆయన జీవితం, వ్యక్తిత్వం విలువలూ అన్నీ తెలుసుకోవాలి అనేవాడు సేజ్. శివాజీ, వాషింగ్టన్ వంటి వారి జీవిత చరిత్రలు అన్నీ ఆయన చదివాడు. థామస్ పెన్ రాసిన “మానవుని హక్కులు” పుస్తకం చదివి మనిషికి ఉన్న హక్కులూ, బాధ్యతలూ చక్కగా తెలిసికొన్నాడు.
మన కులవ్యవస్థ, మన సమాజాన్ని నాశనం చేస్తోందని పేర్జీ చెప్పేవాడు. ఒకప్పుడు మంచిగా ఉన్న మన మతం మూర్ఖపు ఆచారాల్లో చిక్కుకుందనీ, వాటిని రూపుమాపాలనీ అనేవాడు. సేజ్, కబీర్, తుకారాం వంటి భక్తుల సాహిత్యాన్ని, మత సంస్కర్తల రచనల్నీ చదివాడు. ఆ కాలంలోని శూద్ర, అతిశూద్ర కులాల గొడవలు, విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలనీ సేజ్ చెప్పేవాడు. సేజ్, విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు.
ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని, భార్య సావిత్రికి చదువు చెప్పి, ఆమెను మొదటి పంతులమ్మగా చేశాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంత ధనంతో బడి పెట్టాడు.
మానవులందరూ పుట్టుకతో సమానులనీ, వాళ్ళు ఒకరినొకరు సమానులుగా చూసుకోవాలనీ సేజ్ చెప్పేవాడు. ఆడపిల్లలకు చదువు చెపుతున్నందుకు కోపంతో కొందరు సేజీని చంపబోయారు. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే తన జీవితాశయం అనీ, వాళ్ళ చేతుల్లో చావటానికి కూడా తాను సిద్ధం అని చెప్పి, హంతకుల మనస్సును సేర్ జీ మార్చాడు.
శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. “దేవుడు ఒక్కడే. మనందరం ఆయన పిల్లలం. మనిషిని గొప్పవాడిగా చేసేది అతని గుణమే కాని, కులంకాదు.” అనే సిద్ధాంతాలతో “సత్యశోధక సమాజాన్ని” స్థాపించాడు.
సేజ్ అంటే జ్యోతీరావ్ ఫూలే. ఈయన స్త్రీ విద్యకూ, కులరహిత సమాజానికి కృషిచేసిన మహనీయుడు.
ప్రశ్న 3.
జ్యోతీరావ్ ఫూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటనను తెలపండి.
(లేదా)
మంచితనంతో మూర్ఖుల మనసుకూడా మార్చవచ్చు అని నిరూపించారు సేజ్. జ్యోతీరావ్ పూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటన గురించి రాయండి.
జవాబు:
జ్యోతీరావ్ ఫూలే తక్కువ కులాల ఆడపిల్లల చదువులకై బడి పెట్టాడు. ఇది గిట్టని సంఘంలో కొందరు పెద్దమనుషులు ఫూలేని చంపమని దోండిరామ్, కుంబార్ రోడే అనే హంతకులను నియమించారు.
ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక ఫూలే నిద్రపోడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఫూలే పెరటి గుమ్మం తీసుకొని ఇద్దరు హంతకులు గొడ్డళ్ళతో నిశ్శబ్దంగా లోపలకు వచ్చారు. వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు ఫూలే భార్య సావిత్రికీ, ఫూలేకీ ముందు నిలబడి, ఫూలేని చంపడానికి గొడ్డళ్ళు పైకెతారు. వెంటనే ఫూలే భార్య “అన్నల్లారా ! ఆగండి. దయచేసి వెళ్ళిపొండి” అని బ్రతిమాలింది. ఎందుకు వచ్చారని ఫూలే వాళ్ళను అడిగాడు.
ఫూలే బడులు నడపడం ఇష్టంలేని కొందరు పెద్దలు, ఆయనను చంపడానికి తమకు కాంట్రాక్టు ఇచ్చారని, వాళ్ళు ఫూలేకు చెప్పారు.
అప్పుడు ఫూలే వాళ్ళతో – “నా చావు మీకు లాభం అయితే, నన్ను చంపండి. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే, నా జీవితాశయం – బీదవారి చేతిలో చావడంలో తప్పులేదు. నన్ను చంపండి” అని మెడవంచి శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు.
వెంటనే దోండిరామ్, కుంబార్ రోడేలు గొడ్డళ్ళు కిందపడేశారు. ఫూలే కాళ్ళమీద పడ్డారు. “మేము మిమ్మల్ని చంపం. మీరు మా తండ్రి వంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని ఇక్కడకు పంపిన వాళ్ళను చంపుతాం” అన్నారు ఫూలే వాళ్ళను ఆపాడు. వారి ఆలోచన మారేదాకా వారితో మాట్లాడాడు.
వాళ్ళిద్దరూ ఫూలే రాత్రి బడిలో చేరారు. కుంబార్ రోడే ఫూలేకు బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ రోడే “వేదాచార్” అనే పుస్తకం రాసి, ఫూలే పనికి సాయం చేశాడు.
ప్రశ్న 4.
సావిత్రిబాయి ఫూలే పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“సావిత్రిబాయి ఫూలే” ఏకపాత్రాభినయం ; నేను సావిత్రిని.
ఈ రోజు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. మీరు, మేం మా కాలంలో ఎక్కడున్నామో అక్కడే నిలిచిపోయారా ? అని నాకు అనిపిస్తోంది. నేను మహారాష్ట్రలో సతారా జిల్లా, ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారి మొదటి సంతానంగా పుట్టా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. చెట్లు ఎక్కి సీమ చింతకాయలు కోసుకు తినేదాన్ని.
నాకు ఏడవ సంవత్సరంలో పూనాలోని ఫూలే కుటుంబీకుడు జ్యోతిరావ్తో పెండ్లి జరిగింది. మా మామగారు మంచివారు. నా భర్తను నేను సేజ్ అని పిలిచేదాన్ని. సే జీకి చదువు అంటే ఇష్టం. నాకు ఆయన అన్నీ చదివి చెప్పేవారు. సేన్ జీ సాగర్ వెళ్ళారు. ఆడది చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని అక్కడ ఒక తెల్లజాతి మనిషి సేజీకి చెప్పింది.
సేజ్ నాకు చదువు చెప్పడం ప్రారంభించారు. మా మామగారు చదువుకుంటే ఆడది చెడిపోతుందని సేజీకి సలహా చెప్పారు. అయినా సేజ్ ఆ మాట వినలేదు. నా భర్త తక్కువ కులాల ఆడపిల్లల చదువులకు రెండు బడులు పెట్టారు. ఇంతలో ఆ స్కూలు నడిపే బడిపంతులు మానివేశాడు. దానితో ఫూలే బలవంతంపై, నేనే ఆ పిల్లలకు పంతులమ్మనయి, స్త్రీలకు చదువు చెప్పాను. ఆ పని చేయడం ఇష్టం లేని జనం నన్ను తిట్టేవారు. కిటికీలు మూసి నేను వారికి పాఠాలు చెప్పాను.
ఒక రోజున నేనూ, పేజీ నిద్రపోవడానికి సిద్ధంగా ఉండగా ఇద్దరు హంతకులు సేజీని చంపడానికి మా ఇంటికి వచ్చారు. సేజ్ తన్ను చంపండని తలవంచారు. హంతకుల మనస్సులు మారిపోయాయి. మేం ఓ పిల్లవాణ్ణి పెంచుకున్నాం. మా సొంతబిడ్డలాగే వాడిని చూసుకున్నాం. నేనే మొదటి పంతులమ్మను. శిశుహత్యలకు వ్యతిరేకంగా మేము ఒక ఆశ్రమం స్థాపించాము.
సత్యశోధక సమాజాన్ని స్థాపించాము. మేం సాధించిన విజయాలను, మా తర్వాత వచ్చిన ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి. పక్షవాతంతో సేర్జీ మరణించారు. 1897లో పూనాలో ప్లేగువ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధితో బాధపడే పసిపిల్లలను నేను చేరదీశాను. నేను కూడా ప్లేగు వ్యాధితోనే కన్నుమూశాను. మా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళండి. సెలవు.
9th Class Telugu ఉపవాచకం 2nd Lesson నేనూ… సావితీబాయిని Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.
ప్రశ్న 1.
అ) నేను ఆడపిల్లను కాదమ్మా ! ఇదిగో చూడు. ఈ సీమచింతకాయ ఎంత తియ్యగా ఉందో !
ఆ) నాన్న కిందకు దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు.
ఇ) అమ్మా ! నా సీమ చింతకాయలు నేను, పడిపోతున్నా, కొమ్మ విరిగింది.
ఈ) చూడండి. మీ ముద్దుల కూతురు ఏంచేసిందో !
జవాబు:
ఇ) అమ్మా ! నా సీమచింతకాయలు, నేను, పడిపోతున్నా. కొమ్మ విరిగింది.
ఈ) చూడండి. మీ ముద్దుల కూతురు ఏంచేసిందో !
ఆ) నాన్న కిందకు దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు.
అ) నేను ఆడపిల్లను కాదమ్మా ! ఇదిగో చూడు. ఈ సీమచింతకాయ ఎంత తియ్యగా ఉందో !
ప్రశ్న 2.
అ) నా పుస్తకాల నేం చేస్తున్నావు ? పేజీలు పోగొడతావ్ జాగ్రత్త !
ఆ) ‘మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించక పోవడం అన్యాయం’ అని ఆ తెల్లమనిషి సేజీతో అంది.
ఇ) జ్యోతి ! – సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు?
ఈ) ఈ సేజ్ ఎల్లా ఉంటాడబ్బా అనుకొనే దాన్ని. చింత చెట్లు ఎక్కుతాడా?
జవాబు:
ఈ) ఈ పేజీ ఎల్లా ఉంటాడబ్బా అనుకొనే దాన్ని. చింత చెట్లు ఎక్కుతాడా ?
అ) నా పుస్తకాల నేం చేస్తున్నావు ? పేజీలు పోగొడతావ్ జాగ్రత్త !
ఆ) ‘మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించక పోవడం అన్యాయం’ అని ఆ తెల్లమనిషి సేజీతో అంది.
ఇ) జ్యోతి ! – సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు?
ప్రశ్న 3.
అ) నువ్వు చెప్తారు. అంతే ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా.
ఆ) ఒక రోజు సాయంత్రం సేణీ ముఖం వేలాడేసుకొని వచ్చాడు.
ఇ) స్కూలు నడిపే పంతులుగారు బడిమానివేశారు. ఇప్పుడేం చెయ్యాలి?
ఈ) “నేను చదువు చెప్పటమా ? నా వల్లకాదు” నేను చెప్పేది వినకుండా సే జ్, భవాల్కర్ తో మాట్లాడడానికి వెళ్ళాడు.
జవాబు:
ఆ) ఒక రోజు సాయంత్రం సే జీ ముఖం వేలాడేసుకొని వచ్చాడు.
ఇ) స్కూలు నడిపే పంతులుగారు బడిమానివేశారు. ఇప్పుడేం చెయ్యాలి?
ఈ) “నేను చదువు చెప్పటమా? నా వల్లకాదు” నేను చెప్పేది వినకుండా సేజ్, భవాల్కర్ తో మాట్లాడడానికి వెళ్ళాడు.
అ) నువ్వు చెప్తావు. అంతే ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా.
ప్రశ్న 4.
అ) “ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపినవాళ్ళని చంపి వస్తాం”.
ఆ) అన్నలారా – ఆపండి. దయచేసి వెళ్ళిపొండి. భయంతో వారిని ప్రార్థించాను.
ఇ) ‘కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు’.
ఈ) ‘అయితే మీరిక్కడికి యెందుకొచ్చారు ?” అని సేర్ జీ వారిని అడిగాడు.
జవాబు:
ఆ) అన్నలారా – ఆపండి. దయచేసి వెళ్ళిపొండి. భయంతో వారిని ప్రార్థించాను.
ఈ) ‘అయితే మీరిక్కడికి యెందుకొచ్చారు ?’ అని సేజ్ వారిని అడిగాడు.
ఇ) ‘కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు’.
అ) “ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపినవాళ్ళని చంపి వస్తాం”.
ప్రశ్న 5.
అ) నిప్పుల కుండను పట్టుకొని ‘సత్యమేవ జయతే’ అనుకుంటూ, ఆయన అంతిమయాత్రను నేనే నడిపించాను.
ఆ) సేర్జీ తన చుట్టూ జనాన్ని ఏడవొద్దని సైగచేసి, మమ్మల్ని అఖండ్ పాడమని సైగ చేశాడు.
ఇ) ‘మరీ అలసిపోవద్దు’ అని నేనంటే, సావిత్రీ ! చేయాల్సిందెంతో ఉంది. నేను వూరికే ఎట్లా కూర్చోను? అని సమాధానం వచ్చేది.
ఈ) ఆయన్ని చూడటానికి జనప్రవాహం ఎడతెగకుండా వచ్చేది.
జవాబు:
ఇ) ‘మరీ అలసిపోవద్దు’ అని నేనంటే, సావిత్రీ ! చేయాల్సిందెంతో ఉంది. నేను వూరికే ఎట్లా కూర్చోను? అని సమాధానం వచ్చేది.
ఈ) ఆయన్ని చూడటానికి జనప్రవాహం ఎడతెగకుండా వచ్చేది.
ఆ) సేజ్ తన చుట్టూ జనాన్ని ఏడవొద్దని సైగచేసి, మమ్మల్ని అఖండ్ పాడమని సైగ చేశాడు.
అ) నిప్పుల కుండను పట్టుకొని ‘సత్యమేవ జయతే’ అనుకుంటూ, ఆయన అంతిమయాత్రను నేనే నడిపించాను.
ప్రశ్న 6.
అ) సావిత్రీబాయికి వాళ్ళ నాన్న పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఆ) రేపట్నుంచి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి అని అన్నాడు సేర్ జీ.
ఇ) సేత్ జీని చంపడానికి వచ్చిన ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు కింద పారేశారు.
ఈ) సావిత్రీబాయి ఎక్కిన సీమచింత చెట్టు కొమ్మ విరిగింది.
జవాబు:
ఈ) సావిత్రీబాయి ఎక్కిన సీమచింత చెట్టు కొమ్మ విరిగింది.
అ) సావిత్రీబాయికి వాళ్ళ నాన్న పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ఆ) రేపట్నుంచి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి అని అన్నాడు సేర్ జీ.
ఇ) సేర్ జీని చంపడానికి వచ్చిన ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు కింద పారేశారు.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘సావిత్రీబాయి’ పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
ఆధునిక భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. అంటరాని వాడల్లోని బాలికలకు చదువు చెప్పడమే కాక భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి సామాజిక చైతన్యోద్యమానికి ఊపిరి పోసింది. అంటరాని పిల్లలకు చదువు చెప్పడానికి వెళుతున్నప్పుడు జనాల శాపనార్థాలకు, భర్తను చంపడానికి కిరాయి మనుష్యులు వచ్చిన సందర్భంలోను భయపడని ధీరురాలు సావిత్రీబాయి. ప్రాణాంతకమైన అంటువ్యాధి ‘ప్లేగు’తో బాధపడుతున్న పసిగుడ్డును రక్షించడానికి ప్రయత్నించిన కరుణామూర్తి సావిత్రీబాయి.
ప్రశ్న 2.
సావిత్రీబాయి వంటి స్త్రీలు సమాజానికి ఎంతవరకు అవసరం?
జవాబు:
ప్రతి వ్యక్తికి పుట్టింది మొదలు చచ్చేవరకు తోడు ఉండేది, బాధపడేది స్త్రీ మూర్తె. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, కుమార్తెగా ఇలా అనేక రూపాలుగా ప్రతివ్యక్తి జీవితంలో తోడు ఉంటుంది. అటువంటి స్త్రీ ఎదుగుదలను కోరుకోవటం కృతజ్ఞత. ఎదగనీయకపోవటం కృతఘ్నత. నేటి సమాజంలో అక్షరాస్యత ఉంది. అంటరానితనం కూడా కొంత తొలగింది. అది సంపూర్ణత్వం సాధించడానికి సావిత్రీబాయి వంటి స్త్రీ మూర్తుల అవసరం ఎంతో ఉంది. నేటికాలంలో ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా మహిళల సాధికారత ఎంతో అవసరం.
ప్రశ్న 3.
సావిత్రీబాయి చదువు, నేర్చుకునే విషయంలో మామగారి నుండి వచ్చిన విమర్శ ఏమిటి?
జవాబు:
జ్యోతిబాఫూలే ఫరార్ అనే ఆమె మాట ప్రకారం తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పుతున్నాడు. సావిత్రీబాయి మెల్లగా అచ్చులు, హల్లులు, మాటలు, వాక్యాలు నేర్చుకోసాగింది. ఆ సమయంలో జ్యోతిబాఫూలేను ఆయన తండ్రి, “సావిత్రి కెందుకు చదువు నేర్పుతున్నావు? అసలు మన కులం వాళ్ళమే చదువుకోకూడదు. అయినా నిన్ను చదివించాను. ఇప్పుడు నీవు నీ భార్యకు చదువు చెబుతున్నావు. ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుంది. బుద్ధి లేనిదవుతుంది” అని అన్నారు. “నాన్నా ! సావిత్రి చదువుకుని ఆ మాటలు అబద్దాలని నిరూపిస్తుంది” అన్న జ్యోతిబాఫూలే మాటలకు ఏమీ చెప్పలేక అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయారు.
ప్రశ్న 4.
సావిత్రీబాయి చేత మా ‘సేజ్ అని పిలిపించుకొన్న ‘సేజ్ వ్యక్తిత్వం వివరించండి.
జవాబు:
సావిత్రీబాయి భర్త పేరు మహాత్మ జ్యోతిరావ్ పూలే. సావిత్రి ఈయన్ని సేజ్ అని పిలిచేది. సావిత్రీబాయి దృష్టిలో భర్త అంటే “ఎప్పుడు బడి, పుస్తకాలు, చదువు ఇదే ప్రపంచం ఆయనకు” అంటుంది. సేజ్ కులాల గొడవలు విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలని చెప్పేవాడు.
సేర్ జీ విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు. ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని భార్యకు చదువు చెప్పించాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంతధనంతో బడి పెట్టాడు. మానవులంతా సమానులనీ, బీదలకు సాయం చేయడమే తన జీవితాశయమనీ చెప్పాడు. శిశుహత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. ‘కులం కన్నా గుణం మిన్న’ అనే సిద్ధాంతంతో ‘సత్యశోధక సమాజాన్ని’ స్థాపించాడు. ఈయన స్త్రీ విద్యకూ, కుల రహిత సమాజానికి కృషి చేసిన మహనీయుడు.
ఆ) క్రింది ప్రశ్నలకు పదిలేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
సావిత్రీబాయి పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
సావిత్రీబాయి గొప్ప సంఘసేవకురాలు. ఈమె మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారింట్లో పెద్దకూతురిగా పుట్టింది. వెర్రిగా చేలల్లో పడి, పరిగెత్తేది. ముళ్ళూ గిళ్ళూ లెక్కచేసేది కాదు. చింతకాయలు కొట్టుకు తినడం, రేగుపళ్ళు కోసుకు తినడంలో సావిత్రీబాయిని మించినవారు లేరు. ఈమెకు చిన్నప్పుడే జ్యోతీరావ్ తో పెండ్లి అయ్యింది. అక్కడ భర్తనూ, అత్తమామల్నీ సేవిస్తూ వంట వండి పెట్టేది.
సావిత్రీబాయికి, ఆమె భర్త జ్యోతీరావు ఎన్నో విషయాలు చదివి చెప్పేవాడు. సావిత్రీబాయికి భర్త చదువు చెప్పాడు. భర్త నడిపే స్కూలులో పంతులుగారు మానివేస్తే, సావిత్రీబాయి అక్కడ పంతులమ్మగా పనిచేసింది. సావిత్రీబాయి పంతులమ్మ కావడం ఇష్టం లేని ప్రజలు సావిత్రీబాయిని తిట్టేవారు. శాపనార్ధాలు పెట్టారు. అయిన సావిత్రీబాయి బడి కిటికీ తలుపులు మూసి, పిల్లలకు పాఠాలు చెప్పింది. సావిత్రీబాయి భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. భర్తతో పాటు సత్యశోధక సమాజాన్ని స్థాపించింది. సావిత్రీబాయి ఆదర్శ స్త్రీ. భర్త పోయాక, ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవచేసింది. చివరకు ఆ ప్లేగు వ్యాధి సోకడంతో సావిత్రీబాయి కన్ను మూసింది.
ప్రశ్న 2.
బీదవాళ్ళకు సహాయం చెయ్యటమే నా జీవితాశయం – వాళ్ళచేతుల్లో చావటంలో తప్పేముంది? ‘చంపండి – రండి చంపండి’ అన్న పేజీ మాటలను బట్టి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
పేజీ తన జీవితాన్ని బీదవారికి సాయం చేయడానికే అంకితం చేశాడు. సే జీ తక్కువ కులాల ఆడపిల్లలకు బడులు పెట్టి చదువు చెప్పించాడు. భార్యకు తానే చదువు చెప్పి, ఆ బడిలో ఆమెను పంతులమ్మను చేశాడు.
అలాచేస్తే సంఘం పాడవుతుందని, కొందరు పెద్దలు సేజీని చంపమని ఇద్దరు హంతకులకు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ వచ్చినవాళ్ళు తాము సేజీని చంపడానికి గల కారణాన్ని చెప్పారు.
బీదవాళ్ళ చేతుల్లో చావడం తనకు ఇష్టమే అని సేజ్ మెడవంచి నిలబడ్డాడు. దానితో ఆ హంతకులు మనసు మార్చుకొని, తమకు కాంట్రాక్టు ఇచ్చిన వారినే చంపడానికి సిద్ధపడ్డారు. దీనిని బట్టి సేజ్ త్యాగమూర్తి అని, భయం లేనివాడని, హంతకుల మనస్సును కూడా మార్చగల ఉత్తమ శీలం కలవాడని నేను అర్థం చేసుకున్నాను.
ప్రశ్న 3.
‘అల్లరి చేయుట పిల్లల వంతు’ అన్నాడు ఒక కవి. సావిత్రీబాయి బాల్యం కూడా అల్లరి పనులతోనే గడిచింది. దానికి సంబంధించి ఒక సంఘటనను వివరించండి.
జవాబు:
అల్లరి చేయుట పిల్లలవంతు అన్న కవి మాటలు సావిత్రీబాయి బాల్యానికి సరితూగుతాయి. సావిత్రీబాయి మహారాష్ట్రలోని నైగావ్ లో పుట్టింది. చిన్నప్పటి నుండి అల్లరి పిల్లే. ఒకసారి సీమ చింతకాయలు చెట్టెక్కి కోస్తుంటే కొమ్మ విరిగి వ్రేలాడుతూ ఉంది. అప్పుడు ‘అమ్మా నా సీమచింతకాయలు, నేను పడిపోతున్నా, కొమ్మ విరిగింది, నేను పడిపోతున్నా’ అంటూ అరిచింది. వాళ్ళ నాన్న వచ్చి కిందికి దింపాడు. అమ్మ అరుస్తోంది. కాలో చెయ్యో విరిగితే ఎవరు చేసుకుంటారని. అమ్మతో ‘నేను ఆడపిల్లను కాదమ్మా’ అంటూ తల్లికి సీమచింతకాయ ఇచ్చి అక్కణ్ణుంచి పరుగుతీసింది.
ప్రశ్న 4.
‘ఇదిగో ఈ సీమ చింతకాయ చూడు ఎంత తియ్యగా ఉందో’ అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్ళీ పరుగుతీసిన బాల సావిత్రీబాయి బాల్యం వివరించండి.
జవాబు:
పైగావ్ గ్రామంలో పాటిల్ గారి పెద్ద కూతురుగా పుట్టిన సావిత్రిబాయి బాల్యంలో చేలలోపడి పరిగెత్తుతూ, గులకరాళ్ళను, దుమ్మునూ తన్నుకుంటూ, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా లెక్కచేయక, విరబోసుకున్న జుట్టుతో వెర్రిగా పరుగులు తీసేది. చింతకాయలు కొట్టుకు తినడం, రేగిపళ్ళు కోసుకుతినడం దినచర్య సావిత్రికి. ఒక రోజు సీమచింతకాయలు కోస్తూ కొమ్మ విరిగి కిందకు వేలాడుతూ దించమని అమ్మను పిలిస్తే ఆమె చివాట్లు పెట్టింది. తండ్రి వచ్చి కిందికి దించుతాడు. ఈ పిల్లకు తొందరగా పెళ్ళి చేయాలి. కాలో చెయ్యో విరిగితే ఎవరు చేసుకుంటారన్న తల్లి మాటలకు ‘నేను ఆడపిల్లను కాదమ్మా’ ఇదిగో ఈ సీమ చింతకాయ చూడు ఎంత తియ్యగా ఉందో అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్ళీ పరుగుతీసింది గడుగ్గాయి సావిత్రి.
AP Board Textbook Solutions PDF for Class 9th Telugu
- AP Board Class 9 Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 1 శాంతికాంక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 2 స్వభాష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 3 శివతాండవం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 4 ప్రేరణ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 5 పద్యరత్నాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 6 ప్రబోధం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 7 ఆడినమాట Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 8 చూడడమనే కళ Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 9 భూమి పుత్రుడు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 10 బతుకు పుస్తకం Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Chapter 11 ధర్మదీక్ష Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 1 స్వామి వివేకానంద Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 2 నేనూ సావిత్రీబాయిని Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 4 గిడుగు వేంకట రామమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 5 ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu ఉపవాచకం Chapter 6 ధృవతారలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu లేఖలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu వ్యాసాలు Textbook Solutions PDF
- AP Board Class 9 Telugu Grammar Chandassu ఛందస్సు Textbook Solutions PDF
0 Comments:
Post a Comment